కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,167 మందికి పాజిటివ్గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.. తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.. చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు…
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్…
మూడు రోజులు సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ నెల 28,29, 30 తేదీల్లో వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి రోజు వైద్య శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.8 శాతానికి తగ్గిందన్నారు.. ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్స్ కూడా తగ్గాయన్న ఆయర.. రికవరీ రేట్ 92.52 శాతానికి పెరిగిందని.. డెత్ రేట్ 0.52 శాతానికి పడిపోయిందన్నారు..…
కేసీఆర్.. మీది గుండెనా..బండనా అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి అని అన్నారు. 658 కుటుంబాల ఉసురు పోసుకోకండి. బాధితులెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా అని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో తెల్ల రేషన్ కార్డున్న వారందరు కవర్ కారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే అని చెప్పారు. బయట పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.…
డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద…
పోలీసులు ప్రాణాలను అడ్డంపెట్టి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాల రక్షణ కోసం మేము నిరంతరం పని చేస్తున్నాం. మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి మేము రోడ్లమీద మీ కోసం పని చేస్తున్నాం అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ ను ప్రజలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. అనవసరంగా ఎవరు ప్రజలు రోడ్ల మీదికి రావద్దు. వాహనాలు సీజ్ చేసినట్లయితే లాక్ డౌన్ పూర్తయిన తర్వాతనే అప్పగిస్తాం. 99% లాక్ డౌన్ సమర్థవంతంగా విజయవంతమైంది…
రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ ఇస్తాం అని తెలిపారు. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలి. కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుంది. కరోనాతో చనిపోతున్న…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 2,08,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795 కి చేరింది. ఇందులో 2,43,50,816 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,95,591 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,157 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 కి చేరింది. ఇక ఇదిలా…
టాటాస్టీల్ కంపెనీ మరోసారి ఉదారతను చాటుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్తో కన్నుమూసిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగకాలం ముగిసేవరకు మృతుల జీతాలను మృతిచెందినవారి కుటుంబాలకు అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టంచేసింది. కేవలం జీతమే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను కూడా వారి కుటుంబాలకు కూడా అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టం చేసింది. ఉద్యోగుల పిల్లలు చదువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖర్చులు కూడా తామే భరిస్తామని టాటా…