కేసీఆర్.. మీది గుండెనా..బండనా అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి అని అన్నారు. 658 కుటుంబాల ఉసురు పోసుకోకండి. బాధితులెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా అని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో తెల్ల రేషన్ కార్డున్న వారందరు కవర్ కారు. అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే అని చెప్పారు. బయట పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైద్య,ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి అని పేర్కొన్నారు.