ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం.. ఆర్బీఐ నివేదిక ఏం చెబుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్ చూపినంత ప్రభావం సెకండ్ వేవ్ చూపలేదని చెబుతోంది ఆర్బీఐ.. అయితే, అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్న ఆర్బీఐ.. తిరిగి పుంజుకోవడానికి మాత్రం.. ప్రైవేటు డిమాండ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకొచ్చింది.. కరోనా సెకండ్ వేవ్ను ఎంత వేగంగా భారత్ అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి, అవకాశాలు ఆధారపడిఉన్నాయని తెలిపింది.. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది ఆర్బీఐ..
ఇక, కరోనా మహమ్మారి తర్వాత జీడీపీ వృద్ధి కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరగాల్సి ఉందని పేర్కొంది ఆర్బీఐ.. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని.. పెట్టుబడుల కన్నా వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని పేర్కొంది. అయితే, పెట్టుబడుల ద్వారా కోలుకోవడం వల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి సృష్టి జరిగేందుకు అవకాశం ఉంటుందని.. కొంత వరకు వినియోగాన్ని పెంచవచ్చునని ఆర్బీఐ వివరించింది… మరోవైపు.. సవరించిన అంచనాలు విడుదల చేసినప్పుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లోటు పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది ఆర్బీఐ.. ఇక, 2021 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరగడంతో.. రూ.57.08 ట్రిలియన్లకు పెరిగిందని.. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని స్పష్టం చేసింది.. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ ఆర్థిక సంవత్సరం 20లో రూ.29.993 బిలియన్లు అని, ఆర్థిక సంవత్సరం 21లో 506.29 బిలియన్లు అని ఆర్బీఐ తెలిపింది..
Also Read
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!