ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం.. ఆర్బీఐ నివేదిక ఏం చెబుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్ చూపినంత ప్రభావం సెకండ్ వేవ్ చూపలేదని చెబుతోంది ఆర్బీఐ.. అయితే, అనిశ్చిత పరిస్థితులు స్వల్పకాలిక నిరోధంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్న ఆర్బీఐ.. తిరిగి పుంజుకోవడానికి మాత్రం.. ప్రైవేటు డిమాండ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకొచ్చింది.. కరోనా సెకండ్ వేవ్ను ఎంత వేగంగా భారత్ అడ్డుకోగలదనేదానిపైనే దేశ వృద్ధి, అవకాశాలు ఆధారపడిఉన్నాయని తెలిపింది.. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది ఆర్బీఐ..
ఇక, కరోనా మహమ్మారి తర్వాత జీడీపీ వృద్ధి కోసం ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ జరగాల్సి ఉందని పేర్కొంది ఆర్బీఐ.. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల డిమాండ్ వాటా జీడీపీలో దాదాపు 85 శాతం వరకు ఉంటుందని.. పెట్టుబడుల కన్నా వినియోగం ద్వారానే సంక్షోభానంతరం కోలుకోవడం ఎక్కువగా జరుగుతుందని పేర్కొంది. అయితే, పెట్టుబడుల ద్వారా కోలుకోవడం వల్ల మరింత గట్టిగా నిలదొక్కుకోవడం సాధ్యమవుతుందని, తద్వారా మెరుగైన ఉపాధి సృష్టి జరిగేందుకు అవకాశం ఉంటుందని.. కొంత వరకు వినియోగాన్ని పెంచవచ్చునని ఆర్బీఐ వివరించింది… మరోవైపు.. సవరించిన అంచనాలు విడుదల చేసినప్పుడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లోటు పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది ఆర్బీఐ.. ఇక, 2021 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 6.99 శాతం పెరగడంతో.. రూ.57.08 ట్రిలియన్లకు పెరిగిందని.. ఆదాయం 10.96 శాతం తగ్గిందని, అదే సమయంలో ఖర్చు కూడా 63.10 శాతం తగ్గిందని స్పష్టం చేసింది.. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల నుంచి నెట్ గెయిన్స్ ఆర్థిక సంవత్సరం 20లో రూ.29.993 బిలియన్లు అని, ఆర్థిక సంవత్సరం 21లో 506.29 బిలియన్లు అని ఆర్బీఐ తెలిపింది..
Also Read
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!