కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని రాష్ట్రాలను మాత్రం ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది.. దీంతో.. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్డౌన్ను పొడిగిస్తూ వస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, తమిళనాడు కూడా లాక్డౌన్ను పొడిగించింది.. జూన్ 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది తమిళనాడు సర్కార్.. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఉదయం 7 గంటల…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 571044 కి చేరింది. ఇందులో 530025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27793 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
వారం రోజుల తర్వాత కృష్ణపట్నం లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు ఆనందయ్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ అనుమతించం లేదు పోలీసులు.. వారం రోజులపాటు కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ లో ఉన్నారు ఆనందయ్య. అయితే పెద్ద ఎత్తున ఆనందయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు గ్రామస్తులు. అయితే నేను ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఇక్కడి నుంచి…
కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.. ఈ చర్యకు పూనుకున్న తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు.. అయితే, లాక్డౌన్ పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అన్నారు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ముక్కుపిండి ఫీసులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు…
కరోనా వ్యాక్సిన్ల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుందని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిపడ్డ ఆయన.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ సప్లై కూడా లేదన్నారు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యల్లోనూ కేంద్రానికి ముందు చూపు…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది…
సంగా రెడ్డిలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, త్వరలో మరొక 13 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తల్లితండ్రులు జ్ఞాపకార్థము పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచనతో చేస్తున్నాను. పేద…
ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు వ్యాక్సిన్ల కొరతపై సీరియస్గా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ప్రధాని మోడీ గానీ, కేంద్రం గానీ కరోనా సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని మండిపడ్డారు.. కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని.. విస్తరిస్తోన్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుందన్నారు రాహుల్.. మరోవైపు వ్యాక్సినేషన్పై మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించి…
తెలంగాణలో కరోనా కారణంగా అన్నిరకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. పదోతరగతి పరీక్షలను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వాహణ విషయంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ తన అభిప్రాయం తెలిపింది. జులై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. గతంలోనే ప్రశ్నాపత్రాల ముద్రణ పూర్తయ్యాయని, మార్చడం కుదరదని తెలిపింది. పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరు కుదిస్తామని, రాయాల్సిన ప్రశ్నలను…
కరోనా మహమ్మారి కొత్త సమస్యలను సృష్టిస్తోంది. కరోనా సోకిన వారి కంటే, ఎక్కడ కరోనా సోకుతుందో అని భయపడి నిద్రకు దూరమైన వ్యక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడిన వ్యక్తులు కూడా సామాజికంగా దూరాన్ని పాటించాల్సి రావడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, నిద్రలేమి కారణంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కరోనా తరువాత…