కరోనా కట్టడి చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని,…
కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్…
కరీంనగర్ సీవీఎం ప్రైవేటు హాస్పిటల్ నిర్వకంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీవీఎం హాస్పిటల్ లో వెంటిలేటర్ సరిగా లేక రోగి మరణించాడు. అయితే చనిపోయిన విషయం చెప్పకుండా.. ఫైనల్ బిల్లు చెల్లించాలని కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేసారు హాస్పిటల్ సిబ్బంది. ఈ ఘటన పై ఎన్టీవీ చూపిన కథనాలపై స్పందించిన హెచ్చార్సీ… కలెక్టర్, DMHO కు నోటీసులు పంపింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్…
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నా.. మృతుల సంఖ్య ఇంకా భారీగానే నమోదు అవుతోంది.. ఇదే సమయంలో థర్డ్ వేవ్పై పెద్ద చర్చే జరుగుతోంది.. ఇది ముఖ్యంగా చిన్నారులను టార్గెట్ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ మ్యుటేట్ కావడం ద్వారా థర్డ్ వేవ్లో చిన్నారులను ప్రభావితం చేస్తుందనే సంకేతాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదని.. థర్డ్ వేవ్…
ఆనందయ్య మందుని ప్రభుత్వం నిలిపివెయ్యడం సబబు కాదు అని సిపిఐ నారాయణ అన్నారు. ఆనందయ్య ఇప్పటికే 50 వేల మందికి పైగా భాధితులుకు మందుని అందించారు. ప్రజలో ఆనందయ్య మందు పై నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్ లో ప్రవైట్ హస్పిటలో 75 లక్షల బిల్లు కట్టించుకోని… శవాని ఇచ్చారు. డాక్టర్లు అందరు దోచుకుంటున్నారని అనను. కానీ ఆలస్యం చెయ్యకుండా ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించాలి అని తెలిపారు. ఆనందయ్యని ఎవరు ఎమి చెయ్యలేరు… ఆయనకు చాలా…
ఆనందయ్య కి భద్రత పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని సమీక్ష నిర్వహించారు. కృషపట్నం పోర్టులో అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం తో పాటు పలువురు పోలీసులు తో సమావేశమయ్యారు ఎమ్మెల్యే కాకాని. ఆనందయ్య కి గట్టి భద్రత ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ ని కోరిన ఎమ్మెల్యే కాకాని అనంతరం ఎన్టీవీ తో మాట్లాడుతూ… ఐసిఎంఆర్ వచ్చే అవసరం లేదు. ఆయుష్ నివేదిక నే ప్రభుత్వం ఫైనల్ గా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సానుకూలంగా వున్నారు కాబట్టి …ప్రభుత్వం…
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. వాటి గుర్తింపు బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేసిన మంత్రి.. ఆయా గ్రామాల్లో కరోనా కేసుల…
అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి వైద్యం తప్పదు అని మంత్రి బుగ్గన అన్నారు. ఆయుర్వేదిక్, హోమియోపతి వేల సంవత్సరాల నుంచి వున్నా అత్యవసరంలో అల్లోపతి బెటర్ అని తెలిపారు. కోవిడ్ విషయంలో ప్రపంచం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. కరోనాను ఏపీ ప్రభుత్వం అద్భుతంగా హాండిల్ చేస్తుంది. ప్రభుత్వం, అధికారులు కరోనాకట్టడికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వం కరోనా పై సమీక్ష చేస్తుంది. కోవిడ్ నివారణకు ప్రజల సహకారం ముఖ్యం అని తెలిపిన మంత్రి బుగ్గన లక్షణాలు…
ఈరోజు క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై సమీక్ష చేపట్టనున్నారు సీఎం జగన్. ఇందులో ఆనందయ్య మందు పై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరిశీలన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మూడు, నాలుగు రోజుల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు సీఎం. ఇక ఈ సమీక్షకు వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, ఇతర…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం పనితీరుపై పరిశోధన ప్రారంభించింది జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ. మొదటి దశలో ముందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సీసీఆర్ఏఎస్… విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి బాధ్యతలు అప్పగించింది సీసీఆర్ఏఎస్. నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో మందు తీసుకున్న 500 మంది వివరాలు సేకరించిన సీసీఆర్ఏఎస్… వీరి నుంచి అభిప్రాయాలు, వివరాలు తీసుకోనున్నారు ఆయుర్వేద వైద్యులు. కరోనా పరీక్షల రిపోర్ట్, మందు…