ప్రభుత్వ రంగం, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. పెద్ద మొత్తం డిపాజిట్ల(రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ)పై వడ్డీ రేటును 40- 90 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లు మినహా అన్ని డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్బీఐ సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు…
ఆన్-డిమాండ్ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో.. వచ్చే రెండేళ్లలో ఒరిజినల్ షోలు, సినిమాలు మరియు కో-ప్రొడక్షన్లలో హిందీ, తమిళంతో పాటు తెలుగులో 40 కొత్త టైటిల్స్ను విడుదల చేయనున్నట్లు గురువారం తెలిపింది. భారతదేశంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ, దేశంలోని ప్రైమ్ వీడియో స్టోర్తో పే-పర్-వ్యూ మూవీ సర్వీస్లోకి అడుగుపెడుతున్నట్లు, అలాగే రానున్న సంవత్సరాల లైసెన్సింగ్, ఒప్పందాలు మరియు వివిధ భారతీయ స్టూడియోలతో కో-ప్రొడక్షన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీ, తెలుగులో చిత్రాలతో…
గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.450 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48వేలుగా నమోదైంది. అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.వెయ్యి తగ్గి రూ.69వేలకు చేరింది.…
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు ముహూర్తం ఖరారైంది. ఎల్ఐసీ ఐపీవో మే 4 నుంచి మే 9 వరకు జరుగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.21వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఐపీవో ఆధారంగా ఎల్ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది. అటు ఎల్ఐసీ ఐపీవోలో…
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించాడు. ఇటీవల ట్విట్టర్లో వాటాదారుడైన ఎలాన్.. ట్విట్టర్లోని ఒక్కో షేర్కు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న ట్విట్టర్ యాజమాన్యం గందరగోళంలో పడింది. అంతేకాకుండా ఎలాన్ మస్క్ వాటాదారులతో విరివిగా సమావేశాలు నిర్వహించి.. ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతుండడంతో దిగొచ్చిన ట్విట్టర్ యాజమాన్యం.. ఎలాన్తో సమావేశమైంది. అయితే ఈ సమావేశం అనంతరం.. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు…
బైజూస్ యాజమాన్యంలోని ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫారమ్ వైట్హాట్ జూనియర్ (WhiteHat Jr) 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,690 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో రూ. 484 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించింది. రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ (ROC)కి దాఖలు చేసిన వార్షిక ఆర్థిక నివేదికలలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ 2021ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాలు రూ. 483.9 కోట్లుగా ఉంది. అలాగే 2020 అర్థిక సంవత్సరంలో రూ. 19 కోట్లుగా ఉంది.…
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్తో…
హౌస్ షిఫ్టింగ్ ఛార్జీలను తగ్గించడానికి 3 తెలివైన చిట్కాలు భారతదేశంలో, సరైన ప్రణాళిక లేకుండా, గృహాలను మార్చడం కష్టం మరియు ఖరీదైనది. అంతేకాకుండా, ప్యాకింగ్ & మూవింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్క అడుగులోనూ మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఒత్తిడితో కూడిన అనుభవంగా మార వచ్చు. అందుకే మీ వస్తువులను కొత్త ఇంటికి మార్చడానికి సురక్షితమైన సేవలను అందించ్చే మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ప్యాకర్ మూవర్లను నియమించుకోవడం ఉత్తమం. Packers and…
నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆర్బీఐ దృష్టికి రాకుండా కొన్ని బ్యాంకులు లోన్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆర్బీఐ నిఘా పెట్టడంతో అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆదాయం, ఆస్తుల వర్గీకరణ తదితర…
టాటా గ్రూప్స్ తగ్గేదేలే అంటూ మరింత ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటాగ్రూప్స్ మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది. టాటా గ్రూప్స్ త్వరలోనే డిజిటల్ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి డిజిటల్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, జియో, ప్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు షాక్ ఇచ్చే విధంగా టాటా గ్రూప్స్ ఓ యాప్ ను లాంచ్ చేయబోతోంది. ఈ యాప్ ను ఈ నెల 7వ తేదిన…