ఉగాది పర్వదినం రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు శాంతించలేదు. పండగ వేళ అని కూడా చూడకుండా వాహనదారులకు చమురు కంపెనీలు వాహనదారులకు షాకిచ్చాయి. పెట్రోల్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ 80 పైసల చొప్పున పెరిగాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ రేట్లను పెంచడం ఇది పదో సారి. 12 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7.20 చొప్పున పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో…
హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్ కంపెనీ డ్రిల్ మెక్ అడుగుపెట్టనుంది. డ్రిల్ మెక్ రూ. 300 కోట్లతో పెట్టుబడులు పెట్టనుంది. ఇంధనంగా హైడ్రోజన్ భవిష్యత్తు ప్రత్యామ్నాయంగా మారనున్న నేపథ్యంలో ఇడ్రోజెన స్టార్ట్ అప్ను డ్రిల్ మెక్ ప్రారంభించనుంది. హైడ్రోజన్ ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఫైరోలిటిక్ కన్వర్టర్ డ్రిల్ మెక్ తయారు చేసింది. ఈ టెక్నాలజీతో హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ సులభతరం కానుంది. హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు జియోధర్మల్ ఎనర్జీ ను సైతం డ్రిల్ మెక్…
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖాతాలో మరో పెద్ద సంస్థ చేరింది. ప్రాసెస్ మైనింగ్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన విషయం మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. కాగా మినిట్ సంస్థ బిజినెస్ వ్యవహారాల్లో ఆపరేషన్స్ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి చెందింది. వ్యాపార ప్రక్రియ పూర్తి చిత్రాన్ని రూపొందించడం ద్వారా డిజిటల్గా రూపాంతరం చెందడానికి,…
దేశంలో సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా.. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే పెంచాయి. ఈ మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. హైదరాబాద్లో అయితే ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. …
దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.115.42కి చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి 101.58గా నమోదైంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ 91 పైసలు పెరిగి రూ.114.93గా, లీటర్ డీజిల్ 87 పైసలు పెరిగి రూ.101.10గా ఉన్నాయి. మరోవైపు…
అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్,…
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని…
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి. ★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత…
దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్…
దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్లతో…