Home
Business News
Business News News
-
నెట్ఫ్లిక్స్ ఖాతాలో స్కాన్లైన్ వీఎఫ్ఎక్స్
ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక, వినూత్నమైన వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో ఒకటైన జర్మనీకి చెందిన స్కాన్లైన్ వీఎఫ్ఎక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్కాన్లైన్ “స్ట్రేంజర్ థింగ్స్” “కౌబాయ్ బెబాప్”తో సహా అనేక నెట్ఫ్లిక్స్ ఒరిజినల్లపై ఈ స్టూడియో పని చేసింది. అనేక మార్వెల్, డీసీ టైటిల్స్ కోసం స్కాన్లైన్ స్టూడియో వైవిధ్యమైన ఎఫెక్ట్స్ ను అందించింది. 1989లో స్థాపించబడిన స్కాన్లైన్కి వాంకోవర్, మాంట్రియల్,… -
వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తాము డీజిల్ కార్లను తయారుచేసేది లేదని ప్రకటించింది. 2023 తర్వాత దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని.. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతాయని కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి అధికారికంగా తెలిపింది. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలను పాటిస్తూ డీజిల్ కార్ల తయారీని నిర్వహించడంతో ఖర్చు అధికంగా పెరుగుతుందని మారుతీ సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్… -
మనదేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీ ఇదే..!!
లాక్డౌన్ పుణ్యమా అని దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. గత రెండేళ్లలో జనాలపై ఓటీటీల ప్రభావం పెరిగింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. అయితే 2021 త్రైమాసికంలో దేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీలపై ‘జస్ట్ వాచ్’ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీస్ రివ్యూ చేసింది. ఈ రివ్యూలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే… -
తగ్గేదే లే… 4జీ నెట్వర్క్ స్పీడ్లో మళ్లీ జియోనే టాప్
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ స్పీడ్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం… అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో సెకనుకు 21.9 మెగాబిట్ డౌన్లోడ్ వేగంతో జియో తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతీ ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ నిరంతరం డేటా డౌన్లోడ్ వేగం పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. తద్వారా జియో నెట్వర్క్తో అంతరాన్ని తగ్గించుకున్నాయి. 4జీ డేటా డౌన్లోడ్ స్పీడ్లో స్వల్ప తగ్గుదల… -
వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్లు చూశారా?
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్ప్లస్ సంస్థకు మంచి స్థానం ఉంది. వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వన్ ప్లస్ సంస్థ క్రేజీ బ్రాండ్గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికే నార్డ్ సిరీస్లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు మరో ఆకట్టుకునే డిజైన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ పేరుతో కొత్త స్మార్ ఫోన్ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 16 మధ్యాహ్నం తర్వాత ఈ… -
ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు ఈఎంఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్లెట్లు, ఈ-కామర్స్ వెబ్సైట్లు, యాప్లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ… -
షాకింగ్ న్యూస్: త్వరలో మరో రూ.100 పెరగనున్న పెట్రోల్ ధర?
దేశంలో సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే భవిష్యత్లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వెల్లడించారు. 2023 నాటికి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.100 పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని… దాని ధరలను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో… -
మార్కెట్లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి ధరలు
గత నెలలో ఉల్లిపాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టినా కిలో రూ.40కి పైగానే పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని.. దీంతో తాము బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సరఫరా చేస్తుండటంతో ధరలు దిగి వస్తున్నాయని కేంద్రం తెలిపింది. బఫర్ స్టాక్ నుంచి ఢిల్లీ, కోల్కతా, లక్నో,… -
గుడ్న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది. Read Also: పెట్రోల్ రేట్లను మరింత… -
పెట్రోల్ రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు
దీపావళి వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్పై రూ.10 తగ్గాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్,…
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!