తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అలిపిరి గేటు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమలోకి తీసుకొస్తున్నది. ఈ రోజు నుంచి పెంచిన ధరలు ప్రకారం అలిపిరి టోల్గేటు వద్ద చెల్లింపులు ఉండనున్నాయి. కార్లకు రూ.50, బస్సులకు రూ.100 చోప్పున టీటీడీ వసూలు చేయబోతున్నది. అయితే, ద్విచక్రవాహనాలకు మాత్రం ఎలాంటి వసూళ్లు ఉండవు. ఇప్పటికే రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద…
హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టిటిడీ ఇప్పటికే పేర్కోన్నది. దానకి సంబందించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలలో పలు తప్పులు ఉన్నాయని హనుమాన్ తీర్ధక్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు తిరుపతిలోని సంస్కృత విధ్యాపీఠంలో టీటీడి పండితులకు, హనుమాన్ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీకి మద్య వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టిటిడీ…
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో…
నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉన్నది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉదయం కర్ఫ్యూ విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి షాపులతో పాటుగా మామూలు వాహనాలు, రవాహా వాహనాలు నిలిచిపోనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు. దీంతో…
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.
మే 2 న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్…
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్నది. అధికార వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. అదే విధంగా తప్పకుండా తామే గెలుస్తామని…