Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Tirumala

తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం…

Published Date :June 29, 2021 , 2:00 pm
By Manohar
తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం…
  • Follow Us :
  • google news
  • dailyhunt

తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్‌లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా?

సామాన్య భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉంటే ఆహార పానీయాలు ఉచితం

Also Read

  • Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
  • Emergency Alert: మీ మొబైల్స్‌ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
  • Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
  • Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ

ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్‌ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు సర్వదర్శనం భక్తులకు ఉంటుంది. సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే.. వారికి దర్శనభాగ్యం కలిగించే వరకు అన్నీ టీటీడీయే సమకూరుస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి భక్తులు వేచిఉంటే.. ఆ సమయంలో వారికి ఆహార పానీయాలు అన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు గతంగతః అన్నట్టుగా మారిపోయింది.

కరోనా మొదటి వేవ్‌లో 22 వేల మందికి సర్వ దర్శనం!

కరోనా వైరస్ మొదటివేవ్‌లో గతఏడాది మార్చి 21న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసింది టీటీడీ. 80 రోజుల తర్వాత దర్శనాలు పునరుద్ధరించినా.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది. రోజుకి 6 వేల మంది వచ్చేలా మార్పులు చేసినా.. సర్వదర్శన భక్తులుకు ప్రాధ్యనం ఇచ్చింది. మొదట్లో 3వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా.. మరో 3వేల మంది సర్వదర్శనం క్యూలైను ద్వారా వెళ్లేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్యను పెంచుతూ వెళ్లింది. ఆ విధంగా ఈ ఏడాది ఏప్రిల్ 14 నాటికి స్వామివారిని దర్శించుకునే సర్వదర్శనం భక్తుల సంఖ్య 22 వేలకు చేరింది.

ఏప్రిల్‌ 14 నుంచి సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేత

కరోనా సెకండ్ వేవ్‌లో దర్శనాలు ఆపకపోయినా.. భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది టీటీడీ. ఈ ప్రభావం సర్వదర్శనం భక్తులపై పడింది. ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం భక్తులకు జారీచేసే దర్శన టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5 వేలకు కుదించింది. అయినప్పటికీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 18 వేల వరకు ఉంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వర్చువల్ సేవా , శ్రీవాణి ట్రస్ట్, పర్యాటక శాఖ జారీ చేసే టికెట్లు కలిగిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరంతా 300 నుంచి 10వేల రూపాయలు వరకు పెట్టి టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు. దీంతో టికెట్ల ద్వారా కోటి.. హుండీ ద్వారా మరో కోటికిపైగా ఆదాయం వస్తోంది.

సర్వదర్శనంలో భక్తులు వచ్చి 75 రోజులు దాటింది
కొండకు వచ్చే భక్తుల్లో 60-65 శాతం మంది ఉచిత దర్శనం

ప్రస్తుతం కాసులు చెల్లించిన వారికే దర్శనం. సర్వదర్శనం భక్తులు వచ్చి 75 రోజులవుతోంది. ఈ కోటాలో టికెట్లు జారీ చేస్తే కరోనా తీవ్రత పెరుగుతుందనే అనుమానంతో వాయిదా వేస్తూ వస్తోంది టీటీడీ. సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల్లో 60-65 శాతం ఉచిత దర్శనం చేసుకునే వారే ఉంటారు. అలాంటిది కరోనా పేరుతో టికెట్లు కొనేవారికి ఇస్తున్న ప్రాధాన్యంలో కనీసం సగం కూడా సామాన్య భక్తులకు టీటీడీ ఇవ్వడం లేదు. కనీసం అందుకు వీలున్న ప్రత్యామ్నాయాలను కూడా పట్టించుకోవడం లేదు. మళ్లీ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ సాకుతో ఇప్పుడప్పుడే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కే సూచనలు కనిపించడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • tirumala
  • Tirupati
  • ttd

తాజావార్తలు

  • CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!

  • Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?

  • Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్‌మేట్స్’ సిరీస్ రివ్యూ

  • Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!

  • Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions