తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు అండ్ న్యాయవాదులు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. తిరుపతిలో కోర్టు భవనాల సముదాయ నిర్మాణం శుభసూచికమని తెలిపారు. కొత్త కోర్టులు నిర్మించబడటం ద్వారా న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ప్రజలకు వేగంగా న్యాయం అందించే అవకాశాలు…
CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గత పాలనలో విధ్వంసకర పరిస్థితులను చూశాం.. 2019- 2024 మధ్య అనేక దారుణాలు జరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారు.
Tirupati: తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలో అధిక ఫీజులపై నిరసన తెలపడానికి విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలైన అక్బర్, వినోద్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు వాహనంలో…
సూర్యజయంతి రోజైన రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ శోభాయాత్ర, రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు నిరంతరాయంగా కొనసాగింది. చిన్న శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై మాడ వీధుల్లో మలయప్ప స్వామి విహరిస్తుంటే భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. సుమారు 3.45 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండి ఈ వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించారు. కేవలం…
Tirupati Laddu Controversy: తిరుమల హిందువులకు పవిత్రమైన దేవాలయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వస్తారు.. అలాంటి తిరుమల లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం దుర్మార్గం.. జగన్ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
Today My Last Day: తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి తులసి, BSR డిగ్రీ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు.
Kidnap At Tirupati: తిరుపతి నగరంలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. తమిళనాడు నుండి వచ్చి నాలుగో భర్తతో కలిసి జీవనం సాగిస్తున్న మహిళ ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసింది. తిరుపతికి చెందిన మునిరెడ్డి స్థానిక చింతలచేను రోడ్డులో చిత్తు పేపర్లు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు సేకరించే దుకాణం నడుపుతున్నారు. వాటిని తీసుకొచ్చే వ్యక్తుల కోసం పక్కనే గదులు అందుబాటులో ఉంచారు. Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్న్యూస్.. డబ్బును…
TDP vs Jana Sena Clash: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.. అయినా.. కొన్ని సందర్భాల్లో కూటమిలోని కిందిస్థాయి నేతల మధ్య ఏదో విభేదాలు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతి నగరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Read Also: Rukmini Vasanth: ఆ నటుడితో…
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.