తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి.
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు.
Singam Style Police: తమిళనాడులో సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు ఫెయిల్ అయ్యాడు. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
పవిత్రమైన ఆచారాలను నిర్వహించే పూజారులే అసభ్యంగా ప్రవర్తించారు. ఆలయం ప్రాంగణంలోనే మందు పార్టీ చేసుకున్నారు. అంతేకాదు మద్యం మత్తులో అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. పూజారుల చేసుకున్న మందు పార్టీకి సంబందించిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు పూజారులపై కేసు నమోదు అయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. భక్తులు మండిపడుతున్నారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రసిద్ధ పెరియ మరియమ్మన్ ఆలయంలో 28 ఏళ్ల తరువాత పవిత్ర కుంభాభిషేకం జరుగుతోంది. ఈ కుంభాభిషేకానికి…
Train Tickets Hike: ట్రైన్ టిక్కెట్ ధరలు జూలై 1వ తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
Vijay Anthony : నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. అతనికి తమిళ ఇండస్ట్రీలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన వద్ద కోలీవుడ్ స్టార్లు డ్రగ్స్ కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకాంత్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం…
కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా…