Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్లో సంక్షోభాన్ని సృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేసింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అబుదాబి, దుబాయ్, రియాద్ వంటి నగరాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హర్మూజ్ జలసంధి’’ని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధి గుండా ఎటువంటి నౌకకు అనుమతి లేదని ఇరాన్ గార్డులు నౌకలకు చెబుతున్నారని EU నావికా దళం పేర్కొంది.
ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది. ఈ జలసంధిని మూసేయడం ద్వారా తమ ప్రపంచంపై ఇరాన్ ఒత్తిడి పెడుతోంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడికి ప్రతీకారంగా హార్మూజ్ జలసంధిని మూసేస్తామని గతంలో కూడా ఇరాన్ బెదిరించింది.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
అసలేంటి ఈ జలసంధి:
అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన మార్గాన్ని ‘‘హార్మూజ్ జలసంధి’’గా పిలుస్తారు. సన్నటి ఈ సముద్రమార్గం గుండా కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా , ఇరాన్ చమురు ఎగుమతులు కొనసాగుతాయి. ఈ ప్రాంతంలోని ద్వీపాలు ఎక్కువగా ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. వీటిలో ఇరాన్ మిలిటరీ ఉనికి ఉంది. పరిస్థితులు చేజారిపోతే, ఈ జలసంధిని ఇరాన్ మూసేసింది. 33 కి.మీ వెడల్పు ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ముఖ్యంగా, ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా, చైనాకు ఇది ప్రమాదం.
ఈ మార్గం గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా ఏకంగా 67 శాతం ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి. ఒక వేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఫలితంగా చమురు ధరలు చుక్కల్ని అంటుతాయి.
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!