Tamil Nadu: ‘‘మురుగన్ సదస్సు’’కు వెళ్లనున్న సీఎం యోగి, పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన డీఎంకే..
- మధురై మురుగన్ సదస్సుకు సీఎం యోగి, పవన్ కళ్యాణ్..
- తమిళనాడుతో వారికి ఏం సంబంధం అని డీఎంకే ప్రశ్నలు..
- మతం పేరులో బీజేపీ విభజిస్తోందని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నేతలు రావడం ఏంటని తమిళనాడు హిందూ మత మరియు ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అడిగారు.
Read Also: Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..
Also Read
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి? యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి?” అని శేఖర్ బాబు పశ్నించారు. “దేవాలయాలు న్యాయం , క్రమశిక్షణను ప్రచారం చేయడమే. కానీ ఈ వ్యక్తుల సమావేశం జాతి, భాష, మతం ఆధారంగా విభజనలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి సమావేశాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.” అని అన్నారు.
జూన్ 22న జరగబోయే మురుగన్ సదస్సుకు ముందు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అధికార డీఎంకే దీనిని రాజకీయ ప్రేరేపిత సమావేశమని విమర్శించింది. అయితే, బీజేపీతో సహా ఏఐడీఎంకే పార్టీలు ఈ సమావేశాన్ని భక్తి వేడుకగా స్వాగతించాయి. జూన్ 8న మధురైలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. డీఎంకే మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని, కుమారస్వామి ఆరు పవిత్ర స్థలాల్లో ఒకటైన తిరుపరంకుండ్రం కొండ వివాదాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?