AP Deputy CM Pawan: క్రైస్తవులు, ముస్లింలు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటారు.. కానీ హిందువులు మాత్రం..?
- తమిళనాడు మధురై పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- ఓ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించాడు..
- అలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారు: డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Deputy CM Pawan: తమిళనాడు రాష్ట్రంలోని మధురై పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదురైలో ఇన్ని లక్షల మంది ప్రజలు మధ్యలో మాట్లాడుతానని పేర్కొన్నారు. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం.. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం.. అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం.. కుంకుమ, ప్రసాదం తీసుకుంటున్నాం.. కానీ ఒకప్పుడు మధురై ధ్వంసమైంది.. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు.. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు.. పూజలు జరగలేదు.. ఆలయం మూసివేయబడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, 14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కఫూర్ దోచుకున్నాడు.. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది.. అలాంటి మధురైలో చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టింది.. ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Dmitry Medvedev: మా అణ్వాయుధాలను ఇరాన్కు ఇస్తాం.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ఇక, నేను 2014లో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పార్టీ పెట్టినప్పుడు అనుకోలేదు.. ఈ లక్షల మంది ముందరా మాట్లాడుతానని అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. అయితే, ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ముస్లిం కూడా తన మతాన్ని గౌరవించుకుంటాడు.. కానీ, హిందువులు మాత్రం తమ మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరామని ప్రశ్నించారు. ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను.. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను, ఇది నా హక్కు అని పేర్కొన్నాడు. మీరు మా నమ్మకాన్ని అవమానించకండి.. మీ నమ్మకాన్ని మేము అవమానించడం లేదు కదా అని తెలిపారు. స్వయంగా ఆ శివపుత్రుడి వివాహం జరిగిన ఈ నేలను అపవిత్రం చేసేందుకు ఇప్పుడు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ది.. ఇక్కడ పాలకులు కూడా ఆ శక్తులకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పుకొచ్చారు. ఒక చెడు ఒక మంచికే అన్నట్టు.. అదీ హైందవ సమాజం మంచికే అని నేను భావిస్తున్నాను.. మార్పు తధ్యం, అనుకున్నది సాదిస్తాం.. మన ధర్మాం వైపు నిలబడుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!