DMK Govt Erasing Hindu: కుల ధృవీకరణ పత్రాల నుంచి ‘హిందూ’ అనే పదాన్ని డీఎంకే సర్కార్ తొలగిస్తుంది..
- తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే వానతి..
- కుల ధృవీకరణ పత్రాల నుంచి 'హిందూ' అనే పదాన్ని డీఎంకే సర్కారు తొలగిస్తుంది..
- రాజ్యాంగానికి విరుద్ధంగా స్టాలిన్ సర్కార్ పని చేస్తుంది: ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Govt Erasing Hindu: తమిళనాడు రాష్ట్రంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభుత్వం అధికారిక పత్రాల నుంచి హిందూ అనే పేరును ఉద్దేశపూర్వకంగా తుడిచి వేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఆరోపించారు. ఆన్లైన్ లో ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కుల పేర్ల ముందు ‘హిందూ’ అనే పదాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం “హిందూ వ్యతిరేక ప్రవర్తన”గా అభివర్ణించింది. హిందవుల పండుగల సమయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పరని ప్రశ్నించింది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా సీఎం ప్రవర్తిస్తున్నారని పేర్కొంది.
Read Also: Thalliki Vandanam Scheme: “తల్లికి వందనం” స్కీమ్కు అర్హులు కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
అయితే, హిందూ మతంలో కుల భేదాలు ఉన్నందున విద్య- ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు పొందడానికి వారికి అవకాశం ఉంటుంది అని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ తెలిపింది. అలా చేయకాకుండా, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లలో కులం పేరుతో హిందూ అనే పదాన్ని చేర్చినట్లయితే.. వారు మాత్రమే రిజర్వేషన్ పొందగలరని పేర్కొనింది. కానీ, డీఎంకే ప్రభుత్వం అందుకు విరుద్దంగా కుల ధృవీకరణ పత్రాల్లో హిందూ అనే పదాన్ని ఎందుకు తొలగిస్తుందో నాకు తెలియడం లేదన్నారు. ఇక, స్టాలిన్ సర్కార్ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకుంటున్న ఈ చర్యను విరమించుకోవాలి అని వానతి శ్రీనివాసన్ కోరారు.
Read Also: Punjab: ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద మృతి.. కారులో మృతదేహం!
ఇక, ఏదైనా ప్రత్యేక కులం లేదా మతం ద్వారా గుర్తించబడటానికి ఇష్టపడని వ్యక్తులకు రెవెన్యూ అధికారులు ‘కులం లేదు, మతం లేదు’ సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, పిటిషనర్ కుటుంబానికి అటువంటి సర్టిఫికెట్లు జారీ చేయాలని స్థానిక తహశీల్దార్ను ఆదేశించడానికి నిరాకరించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!