Home
International News
International News News
-
USA: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. -
UK Heatwave: బ్రిటన్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అల్లాడుతున్న ప్రజలు.. రైళ్లు బంద్
యూరప్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లో కనీవిని ఎరగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం దేశంలో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పాటు ఎమర్జెన్సీని విధించింది. లండన్ లోని హీత్రూలో దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అంతకుముందు ఆగ్నేయ ఇంగ్లాండ్ సర్రే ప్రాంతంలో నమోదైన 39 డిగ్రీల ఉష్ణోగ్రతను బద్దలు కొట్టింది. సోమవారం లండన్… -
Srilanka Economic Crisis: దేశాన్ని ఆదుకునేందుకు యువత ప్రయత్నం..
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడే పరారయ్యాడు. ప్రజలు నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులు..అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లాడు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తగ్గించారు. ప్రభుత్వ భవనాలను కూడా ఆందోళనకారులు ఖాళీ చేశారు. ఈ రోజు శ్రీలంక పార్లమెంట్ సమావేశం కాబోతోంది. కొత్త అధ్యక్షుడి… -
America: అమెరికాను వణికిస్తున్న రాకాసి నత్తలు.. ఫ్లోరిడాలో లాక్డౌన్
అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల… -
Srilanka Crisis: రాజపక్స పారిపోయేందుకు భారత్ సహకారం.. స్పందించిన విదేశాంగ శాఖ
శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ… -
Pakistan: లోయలో పడ్డ బస్సు..11 మంది దుర్మరణం
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ… -
Putin: మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు.. 30 ఏళ్లు చిన్నదైన ప్రేయసితో..
ప్రపంచ అగ్రనేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. 69 ఏళ్ల పుతిన్ తన కన్న 30 ఏళ్లు చిన్నదైన అలీనా కుబేవా(39)తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే మరోసారి అలీనా కుబేవా గర్భంతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పుతిన్ కు అమ్మాయి జన్మిస్తుందని తెలుస్తోంది. అయితే కుబేవా గురించి రహస్యాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కుబేవాకు… -
UK Political Crisis: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి వర్గం నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేశారు. క్యాబినెట్ లో కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ తో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వరకు మొత్తం ఆరుగులు మంత్రులు రాజీనామా చేసి బోరిస్ జాన్సన్ పై ఒత్తడి పెంచారు. ఇదిలా ఉంటే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలోని 54… -
China: వెంటాడుతున్న కరోనా.. 300పైగా కొత్త కేసులు
కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలు పెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్ననగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. అయితే.. బుధవారం జియాన్.. షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్ డౌన్ గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నుంచి రేషన్ అందిందని షాంఘై ప్రజలు సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. తాజాగా విజృంభణ… -
Shark Attack: స్విమ్మింగ్ చేస్తున్న వారిపై షార్క్ దాడి.. ఇద్దరు మహిళల మృతి
ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు…
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!