Colombia: జైలులో మంటలు..51 మంది ఖైదీల దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే క్రమంలో ఏర్పడిన నిరసనల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఏకంగా 51 మంది ఖైదీలు దుర్మరణం పాలయ్యారు. 24 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ కొలంబియాలోని టోలువాలోని ఒక జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొలంబియా న్యాయమంత్రి విల్సన్ రూయిజ్ చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఖైదీల మధ్య గొడవ జరిగిందని.. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఒక ఖైదీ పరుపును తగలబెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. మంటలు ఆర్పేందుకు జైలు సిబ్బంది ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. అగ్నిమాపక సిబ్బంది కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని.. ఈ లోపే మంటలు విస్తరించాయని మంత్రి రూయిజ్ వెల్లడించారు.
Also Read
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
- US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
- Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, వెనుజులా, కొలంబియా వంటి దేశాల్లో జైళ్లు బాగా రద్దీగా ఉంటాయి. చాలా వరకు జైళ్ల సగటు సామర్థ్యం కన్నా 20 శాతం ఖైదీలు అధికంగా ఉంటారు. తాజాగా టోటువాలో జైలులో కూడా 17 శాతం అధికంగా ఖైదీలు ఉన్నారు. కొలంబియా దేశ చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. గతంలో కూడా లాటిన్ అమెరికా ఖండంలోని పలు దేశాల్లో ఇలాగే జైళ్లలో అల్లర్లు, ప్రమాదాలు, గ్యాంగ్ వార్లతో చాలా మంది మరణించారు. మార్చి, 2020లో బోగోటాలోని పికోటా జైల్ లో అల్లర్ల కారణంగా 24 మంది మరణించారు. జైలులో కరోనా చర్యలను వ్యతిరేకిస్తూ మొదలైన అల్లర్ల కారణంగా ఈ మరణాలు సంభవించాయి. 2019లో బ్రెజిల్ లోని ఓ జైలులో 50 మందికి పైగా చంపబడ్డారు. 2018లో వెనుజులాలో ఒక జైలులో అగ్ని ప్రమాదం వల్ల అనేక మంది మరణించారు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..