ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, జగన్ విధ్వంసం చేశాడు. జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా రూ. 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోంది. గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా రూ. 50 వేల కోట్లు నష్టపోయాం.. కూటమి ప్రభుత్వం…
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన పీఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య జరిగిన రోజు అక్కడ దొరికిన లేఖ గురించి వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు. లేఖ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి తనకు చెప్పాడని వెల్లడించాడు. లేఖ దాచిపెడితే పోలీసులు నుండి సమస్య వస్తుందని ఆ రోజు చెప్పానని అన్నారు. నేను చెప్పింది చెయ్ అని…
రేపు కాకినాడ రూరల్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరుగనున్నది. కాకినాడ రూరల్ మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు ఉన్నాయి. 2021 లో జరిగిన ఎన్నికల్లో 15 స్థానాల్లో వైసిపి, మూడు స్థానాలు జనసేన గెలుపొందాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీపీ రాజీనామా చేశారు. తాజాగా ఏడుగురు వైసిపి ఎంపీటీసీలు జనసేనలో చేరారు. దీంతో మండల పరిషత్ లో జనసేన బలం పదికి చేరింది. తమకు మద్దతు ఇస్తున్న పదిమంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే కుమారుడు సందీప్ లంబసింగిలో…
ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఫస్ట్ వాటర్ బెల్, 11 గంటలకు సెకండ్ వాటర్ బెల్, 12…
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. తమ కుటుంబ మూలాలున్న గ్రామాల అభివృద్దికోసం అవసరమైన మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించారు.. అక్కడి సమస్యలను పేషీ అధికారుల ద్వారా తెలుసుకొనున్నారు. ఈనెల 28వ తేదీన పవన్ పేషీ అధికారులు అయా గ్రామాల్లో పర్యటించనున్నారు..
పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, రాజమండ్రి ఆస్పత్రికి వచ్చిన కేఏ పాల్.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు..
అటవీశాఖ అధికారులు చేసిన పని టీటీడీకి తలనొప్పిగా మారింది. పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సెక్యూరిటీ ఆడిటింగ్ పేరుతో అటవీశాఖ అధికారులు పాపవినాశనం డ్యామ్ లో బోటింగ్ కి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణులను రప్పించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..