Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ను పూర్తిగా నిర్మూలిస్తాం
- నల్లగొండలో ఫ్లోరైడ్కు శాశ్వత చెక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా
- ఎస్ఎల్బీసీ స్వరంగం పనులు వేగవంతం.. 2028 నాటికి పూర్తి లక్ష్యం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కొత్త ఊపు.. చెరువులు నింపే దిశగా అడుగులు
- రహదారుల విస్తరణతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ మండలం రాముల బండలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్బిసి స్వరంగం పనులపై మంత్రి స్పష్టతనిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించినప్పటికీ, దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, దాంతో పనులు నిలిచిపోయాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులను వేగవంతం చేశామని, ఇప్పటికే 18 మీటర్ల పని పూర్తయిందని తెలిపారు. 2028 జూన్ నాటికి ఈ స్వరంగ మార్గాన్ని పూర్తి చేసి, జిల్లా నుంచి ఫ్లోరైడ్ను శాశ్వతంగా పారద్రోలుతామని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
17 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులను నింపుతున్నామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మరో రూ. 200 కోట్లు ఖర్చు చేసి, లైనింగ్ పనులు పూర్తి చేస్తామని, తద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సాగునీటితో పాటు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!