Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ను పూర్తిగా నిర్మూలిస్తాం
- నల్లగొండలో ఫ్లోరైడ్కు శాశ్వత చెక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా
- ఎస్ఎల్బీసీ స్వరంగం పనులు వేగవంతం.. 2028 నాటికి పూర్తి లక్ష్యం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కొత్త ఊపు.. చెరువులు నింపే దిశగా అడుగులు
- రహదారుల విస్తరణతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ మండలం రాముల బండలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్బిసి స్వరంగం పనులపై మంత్రి స్పష్టతనిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించినప్పటికీ, దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, దాంతో పనులు నిలిచిపోయాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులను వేగవంతం చేశామని, ఇప్పటికే 18 మీటర్ల పని పూర్తయిందని తెలిపారు. 2028 జూన్ నాటికి ఈ స్వరంగ మార్గాన్ని పూర్తి చేసి, జిల్లా నుంచి ఫ్లోరైడ్ను శాశ్వతంగా పారద్రోలుతామని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read
17 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులను నింపుతున్నామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మరో రూ. 200 కోట్లు ఖర్చు చేసి, లైనింగ్ పనులు పూర్తి చేస్తామని, తద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సాగునీటితో పాటు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!