Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
రఘురామ కృష్ణంరాజు @ 3468
నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు.. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను జీజీహెచ్ నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తరలించారు.. ఇక, ఆయనకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక… -
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోసారి భారీగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 24,171 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక మృతుల సంఖ్య సెంచరీ దాటేసి 24 గంటల్లో 101 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 21,101 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. రాష్ట్రం లో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల… -
కోవిడ్ ఆస్పత్రిగా పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రి.. మంత్రి ప్రకటన
కరోనా సెకండ్ వేవ్ ఏపీలో కల్లోలమే సృష్టిస్తోంది… ఇక, చిత్తూరు జిల్లాలో వరుసగా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి… దీంతో.. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిని కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ ఆస్పత్రిలో వంద ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు మంత్రి… రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ కు సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. గుజరాత్ నుండి… -
ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం…
మన దేశంలో ఓ వైపు కరోనా కేసులు భారీగా నమోదవుతుండగా… ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తూ ఉంది. అయితే తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఆ జిల్లాలోని నిడదవోలు పాత పశువుల హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు అనుమానం రేకెత్తుతుంది. అయితే 15 రోజుల క్రితం కరోనా నుండి కోలుకున్న అంజిబాబుకు గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుంది. దాంతో ఆసుపత్రికి… -
ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద ఉన్న అతి తీవ్ర తుఫాను – తౌక్టే- గడచిన 06 గంటల్లో, గంటకు సుమారు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిం చి, ఈ రోజు – 16 మే, 2021 ఈ రోజు 08.30 గంటల కు- తూర్పు మధ్య అరేబియా సముద్రం దగ్గర Lat 15.3 deg N, / Long 72.7 deg E వద్ద, పనజిం – గోవా కి పశ్చిమ నైరుతి దిశగా 120… -
ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు…… -
అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి…
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్… -
తెలకపల్లి రవి : అంబులెన్స్ వివాదం తెచ్చిన ప్రశ్న! ఉమ్మడి రాజధాని ఇంకా ఉన్నట్టా, లేనట్టా..?
ఎపి నుంచి వచ్చే ఆంబులెన్సును తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్పోస్టులో ఆపడం తీవ్ర ఆందోళన ఆవేదనకు దారితీసింది. కరోనాచికిత్స అవసరాలను బట్టి చూసినా హైదరాబాద్కు మరో మూడేళ్లు ఎపి తెంగాణ ఉమ్మడి రాజధాని ప్రతిపత్తి రీత్యా చూసినా ఇది చాలా అనూహ్యమైన పరిణామం. ఈ ఘటను కలకలం రేపుతున్నా ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన లేకపోయింది. తెలంగాణ హైకోర్టు తనకు తానుగా దీనిపై ఆగ్రహం వెలిబుచ్చి ఆపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా తెలంగాణ వైఖరి మారకపోవడం,… -
విలువలులేని రాజకీయం.. గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది… రెబల్ ఎంపీపై మండిపడుతోన్న వైసీపీ నేతలు.. ఆయన అరెస్ట్ను సమర్థిస్తూ వస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రఘురామకృష్ఱంరాజు విలువలు లేని రాజకీయం చేశాడంటూ ఫైర్ అయిన ఆయన.. సంవత్సరం నుండి రాష్ట్రంతో సంబంధాలు… -
రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు…
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!