* భారత్ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగతం.. రాజ్ ఘాట్ ను సందర్శించనున్న పుతిన్.. హైదరాబాద్ హౌజ్ లో భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం.. పలు అంశాలపై జరగనున్న ఒప్పందాలు.. భారత మండపంలో జరిగే ఫిక్కీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి హాజరుకానున్న పుతిన్.. రష్యా ప్రభుత్వ చానెల్ ను భారత్ లో ప్రారంభించనున్న పుతిన్.. ఇవాళ రాత్రి రాష్ట్రపతి…
2026లో ప్రభుత్వ సెలవుల ఇవే.. ఉత్తర్వులు జారీ.. డిసెంబర్ నెలలోకి వచ్చేశాం.. త్వరలోనే 2025 ఏడాదికి బైబై చెప్పి.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.. ఇక, వచ్చే ఏడాది ఎప్పుడు సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల్లో ఏం ప్లాన్ చేసుకోవాలని ఎదురు చూసేవాళ్లు సైతం ఉన్నారు.. పబ్లిక్ హాలీడేస్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూ్ళ్లకు కూడా సెలవులు ఉండడంతో.. వాటికి అనుగుణంగా ఇప్పుడే.. ప్రణాళికలు చేసుకునేవారు కూడా ఉన్నారు.. ఇక, ఈ నేపథ్యంలో…
వైఎస్ జగన్కు అచ్చె్న్నాయుడు సవాల్.. చర్చకు సిద్ధమా..? అబద్ధాలకు అంబాసిడర్గా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్ జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అబద్ధాలను బట్టబయలు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ మాట్లాడే…
High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు.. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు.. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు.. అయితే, పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు.. భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. Read Also: Top Headlines @ 9 PM: టాప్…
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. డీఎంహెచ్వో వివరణ స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. పల్నాడు జిల్లా డీఎంహెచ్వో రవికుమార్ స్క్రబ్ టైఫస్ కేసులపై వివరణ ఇచ్చారు.. జనవరి నుండి ఇప్పటి వరకు మొత్తం 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజలు అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీఎంహెచ్వో రవికుమార్ వివరాల ప్రకారం, స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు.. ఇది ఒక రకమైన చిన్న…
అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారింది.. ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించండి.. అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. అయితే, ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించండి అంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై…
కూటమి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సీనియర్ ఐపీఎస్ ఉన్నట్టుండి ఎందుకు కొత్త పొలిటికల్ ఫార్ములాని తెర మీదికి తెచ్చారు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక తెర వెనక వేరే రాజకీయ శక్తులుండి మాట్లాడిస్తున్నాయా? ఆయన పేల్చింది సీమ టపాకాయా? లేక పొలిటికల్ ఆర్డీఎక్సా? ఎవరా ఐపీఎస్? ఏంటా కొత్త ఫార్ములా? Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అత్యంత కీలక పాత్ర పోషించే,…
CM Chandrababu : రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఖనిజ వనరులను సమర్థంగా వినియోగించడం, అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల లభ్యత, విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై ఆయన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ విశాఖపట్టణంలో పరిశ్రమలు వేగంగా వస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రను మెటల్ ఆధారిత…
ఆమెని ఎలాగైనా సరే…. నియోజకవర్గం నుంచి పంపేయాలని ఆ పెద్దాయన, ఉఫ్మని ఊదేస్తే కొట్టుకుపోవడానికి నేనేమన్నా ఎండుటాకునా? టిష్యూ పేపర్నా..? శివంగిని… అంటూ ఆమె మేటర్ని మాంఛి రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ కేడర్ కూడా ఇద్దరి మధ్య సేఫ్ గేమ్ ఆడుతూ తూనికలు-కొలతలు వేస్తోందట. ఏ నియోజకవర్గంలో ఉందా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి? ఎవరా ఇద్దరు నేతలు? Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు…
Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి…