దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 కేసులు నమోదవ్వగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కొత్తగా రెండు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 10 కి చేరింది. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు…
మన జెండా.. మువ్వన్నెల పతాకం మన జాతి ఔన్నత్యానికి ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఎక్కడుందో తెలుసా? నేవీ డే సందర్భంగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ జాతీయ జెండా ఆషామాషీగా లేదు. చాలా పెద్దది. జాతీయ జెండా 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కేజీల బరువుతో ఉన్న మన జెండా అందరినీ ఆకట్టుకుంటోంది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో దీన్ని ప్రదర్శించారు.…
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు తెలంగాణ రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అనురాధ వివరాలను వెల్లడించారు. జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళ నిందితుల నుండి రూ. 7లక్షల20 వేల రూపాయలు విలువ చేసే 72 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల్లో మహారాష్ట్ర కు చెందిన…
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల…
నిన్నటి రోజున ఐపీఎల్ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేలంలో ఎవరు.. ఏ ధరకు కొనుగోలు అయ్యారో తెలుసుకుందాం. ఐపీఎల్లో అత్యధిక ఐదుసార్లు టైటిల్ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్తోపాటు ఫిట్నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం 42…
ఆన్లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలను అందిస్తూ అందరికీ చేరువైన ‘ఓలా’ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చింది.. ఇప్పటికే ఆటోలు, బైక్లు కూడా ఆన్లైన్లో బుక్చేసుకునే అవకాశం కలిపించిన ఆ సంస్థ.. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించింది.. ‘ఓలా స్టోర్’ పేరుతో స్టోర్లను తెరించింది.. ఆన్లైన్లో బుక్చేసుకుంటే.. నేరుగా కిరాణా సరుకులను డోర్ డెలివరీ చేయనుంది… ఈ సరికొత్త బిజినెస్లో భాగంగా మొదట ముంబై, బెంగళూరు అంతటా ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది ఓలా..…
ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సబ్యసాచి ముఖర్జీ. బాలీవుడ్ సెలబ్రెటీలందరికి సబ్యసాచి డిజైన్స్ నుంచే బట్టలు కానీ, నగలు కానీ వెళ్తాయి.. ఆయన డిజైన్స్ అలా ఉంటాయి. ఇక ఇటీవల సబ్యసాచి కలెక్షన్స్ నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతున్నాయి. మొన్నటికి మొన్న మంగళ సూత్ర యాడ్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయించి నెటిజన్ల చేత తిట్లు తిన్న ఈయన మరోసారి మోడల్స్ విషయంలో నెటిజన్ల కళ్లలో పడ్డాడు. తాజాగా సబ్యసాచి డిజైన్స్ వింటర్…
భారత తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’ ఐఎన్ఎస్ విశాఖపట్నం నేడు ముంబయి విధుల్లో చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లా డారు. రాజ్నాథ్ సింగ్ అధికారులతో కలిసి ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను పరిశీలించారు. దీని రాకతో హిందూ మహాసముద్రంలో నౌకదళంలో భారత్ బలం మరింతగా పెరిగిందన్నారు. భారత్పై ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాలకు తగిన గుణపాఠం…
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. రకుల్ షూటింగ్ నిమిత్తం వేరే చోట ఉండడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.…