ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెలరోజులవుతోంది. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ ఇప్పటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగలేదు.
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా వాహనదారులకు ఆయిల్ సంస్థలు శుభవార్త చెప్పాయి.
ముంబైలోని ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విచారణకు పిలిచి.. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శనివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.
అమెరికా రాయబారి సెర్గియో గోర్ ముంబైలో పర్యటిస్తున్నారు. రాయబారిగా తొలి పర్యటన కోసం ముంబైకు వచ్చారు. పర్యటనలో భాగంగా శనివారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సమావేశం అయ్యారు.
ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ముంబైతో పాటు 28 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల దగ్గర క్యూ కట్టారు.
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.
ముంబై ట్రాఫిక్ ఢిల్లీ కంటే చాలా బెటర్ అని.. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ముంబైలో ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది. న్యూఇయర్ వేడుకల పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిచి దుశ్చర్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.