ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు భారత్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు ఘనస్వాగతం పలికారు.
Student Murder: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన MBA విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యువతిని హత్య చేసిన ఆమె ప్రేమికుడు పీయూష్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి ముంబై, పన్వేల్ ప్రాంతాల్లో దాక్కున్నాడు. సాంకేతిక ఆధారాల సహాయంతో అతని స్థానాన్ని గుర్తించిన పోలీసులు…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకు ఎన్సీపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన బీజేపీలో విలీనం కావొచ్చని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ముంబైలోని ములుండ్లో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కూలిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. రద్దీగా ఉన్న సమయంలో కూలిపోవడంతో అనేక మంది గాయపడ్డారు.
రేపే ప్రేమికుల రోజు. ప్రేమకు గుర్తుగా లవర్స్ శుభాకాంక్షలు.. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలాంటి శుభ తరుణంలో ఘోరం జరిగిపోయింది. ట్రయాంగిల్ లవ్ కారణంగా పట్టపగలే అత్యంత దారుణంగా యువతి హత్యకు గురైంది. ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.
ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ అని.. అలాంటిది ఆ పార్టీ నుంచి కలిగిన లాభం శూన్యం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ముంబైలో కార్యక్రమం జరిగింది.
ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెలరోజులవుతోంది. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ ఇప్పటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగలేదు.
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా వాహనదారులకు ఆయిల్ సంస్థలు శుభవార్త చెప్పాయి.
ముంబైలోని ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విచారణకు పిలిచి.. అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శనివారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.