గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు (Nidadavole) మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు (Burugupalli Sesha Rao) ఇంటిని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు.
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనాని.. భీమవరం పర్యటన మరుసటి రోజుకు వాయిదా పడినట్టు తెలిపారు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనలు డైలమాలో ఉన్నాయి. హెలీపాడ్ ఏర్పాటుకు అధికారులు అనుమతుల నిరాకరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం పర్యటనను పవన్ కల్యాణ్ వాయిదా వేసుకున్నారు. ఇటు.. అమలాపురంలోనూ హెలీపాడ్ ఏర్పాటుకు ఆర్ అండ్ బీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు.
Pawan kalyan’s Varahi Yatra starts from Today in Kathipudi: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి…