ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు.
Pawan kalyan’s Varahi Yatra starts from Today in Kathipudi: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి…
ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రచార యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు.
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే, సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు.
జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు, నాయకులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.