CM Jagan: త్వరలోనే మేనిఫేస్టో విడుదల.. చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాక, కరోనా లాంటి కష్టాలు వచ్చినా.. తగ్గేది లేదని ముందుకు వెళ్లామని తెలిపారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలుచేశామని పేర్కొన్నారు.
మూడు పార్టీలు 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.. 2014లో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలు చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారు.. మళ్లీ పొత్తుల డ్రామాతో చంద్రబాబు ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. DTS పద్ధతిలో ఏడాదికి రూ.75 వేల కోట్లు ఇచ్చాం.. మన సంక్షేమ పథకాల్ని చూసి తట్టుకోలేక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వాదించారన్నారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలని సీఎం తెలిపారు. మనం అమలు చేస్తున్న 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరు.. ఎవరైనా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
Also Read
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
చంద్రబాబు చెబుతున్న సూపర్-6కు.. ఏటా రూ.73 వేల కోట్లు కావాలని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు చెబుతున్న ఏడో హామీకి రూ.87 వేలకోట్లు కావాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ఇప్పటికే రూ. లక్షా 50 వేల కోట్లు దాటుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో 58 నెలల్లో 136 సార్లు బటన్ నొక్కి.. రూ. 2 లక్షల 70వేల DBT చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు మీకు మంచిరోజులు తెస్తాను అని చెప్పా.. పేదవారి భవిష్యత్ బాగుండాలంటే.. మళ్లీ జగన్ నే తెచ్చుకోవాలని కోరారు. తనపై అరడజను పార్టీలు.. బాణాలు ఎక్కుపెట్టాయని అన్నారు. బాబుకు ఓటేయడమంటే.. చంద్రముఖిని మన ఇంటికి తెచ్చుకున్నట్లేనని విమర్శించారు. సైకిల్ ఇంటి బయట.. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలి.. 175కు 175 అసెంబ్లీ సీట్లు.. 25కు 25 లోక్ సభ సీట్లు గెలవడానికి సిద్ధమేనా సీఎం జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!