Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జనసేనాని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
Also Read:Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
సభలో భారీగా జనసైనికులు పాల్గొననున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బందరులో 35 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సంబంధిత రైతుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లతో పది గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్ ప్రాంతంలోనే భోజన వసతి కల్పిస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పండ్లు అందించేందుకు కమిటీలను నియమించారు. వైద్య బృందాలు, 8 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. పార్టీ అధినేత పవన్కల్యాణ్ మధ్యాహ్నం వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం బయలు దేరుతారు. సాయంత్రం 5గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ జరుగనుంది. పవన్కు విజయవాడ-బందరు మధ్య దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్
రా ష్ట్రంలో ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉన్నందున పవన్కల్యాణ్ తన రాజకీయ పయనానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయనున్నారనే దానిపై ప్రధానంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచిన పవన్.. ఈ సభ ద్వారా తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలను, కార్యాచరణను ప్రకటించే అవకాశ ఉంది.
మరోవైపు కృష్ణా జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రదర్శనలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!