Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని జనసేనాని పవన్ భావిస్తున్నట్టు సమాచారం.
Also Read:Off The Record: ఎమ్మెల్యేలు లేకున్నా.. ఏంటీ ధీమా?
Also Read
సభలో భారీగా జనసైనికులు పాల్గొననున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. బందరులో 35 ఎకరాల్లో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం, 65 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సంబంధిత రైతుల నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్ఈడీ స్క్రీన్లతో పది గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్ ప్రాంతంలోనే భోజన వసతి కల్పిస్తున్నారు. తాగునీరు, మజ్జిగ, పండ్లు అందించేందుకు కమిటీలను నియమించారు. వైద్య బృందాలు, 8 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. పార్టీ అధినేత పవన్కల్యాణ్ మధ్యాహ్నం వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం బయలు దేరుతారు. సాయంత్రం 5గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు సభ జరుగనుంది. పవన్కు విజయవాడ-బందరు మధ్య దారి పొడవునా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్
రా ష్ట్రంలో ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉన్నందున పవన్కల్యాణ్ తన రాజకీయ పయనానికి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయనున్నారనే దానిపై ప్రధానంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచిన పవన్.. ఈ సభ ద్వారా తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలను, కార్యాచరణను ప్రకటించే అవకాశ ఉంది.
మరోవైపు కృష్ణా జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రదర్శనలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!