Vijay Sai Reddy: ఆరు అంశాలపై సీఈసీకి నివేదిక.. గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sai Reddy: ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బృందాన్ని వరుసగా కలుస్తున్నాయి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఈసీ బృందాన్ని కలిశారు ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాం అన్నారు. అయితే, జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని అడిగాం. పొత్తులో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారన్నారు. గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు.. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈవోకి కంప్లైంట్ ఇచ్చారు.. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నాడని.. కర్నూల్ జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు.. కానీ, అక్కడ వెరిఫికేషన్ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని తెలిపారు.
Read Also: KA Paul: సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..!
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారని పేర్కొన్నారు సాయిరెడ్డి.. తప్పు దోవ పట్టించిన కోనేరు సురేష్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. ఇక, రెడ్ బుక్ పేరుతో అధికారులపై నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం అన్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా ఒకేసారి లోక్ సభ ఎన్నికలు పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!