KA Paul: చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు. బీజేపీకి ఎందుకు జనసేన పార్టీ పొత్తు.. ఇన్ కం టాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీ పొత్తు అని ఆయన వ్యాఖ్యనించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానిని పాల్ అన్నారు. బీజేపీ-బి పార్టీలను ఓడిస్తానని తెలిపారు.
Read Also: Rajinikanth: భారతీయుడు+విక్రమ్ = జైలర్…
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
చిరంజీవి, పవన్ కళ్యాణలను ప్రజలు నమ్మకండి అని కేఏ పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ ది వారహి యాత్ర కాదు మోడీ యాత్ర అని ఆయన విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు అని కేఏ పాల్ తెలిపారు. సిగ్గు ఉన్న వారు ఏవరైన జనసేనలో చేరతారా అంటూ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో చేస్తుంది వారాహి యాత్ర కాదు.. అది కేవలం బీజేపీ కోసమేనని ఆయన ఆరోపించారు. దీనిపై చిరంజీవి, పవన్, నాగేంద్రబాబుతో ఓపెన్ డిబేట్ కు నేను సిద్ధంగా ఉన్నాను అని కేఏ పాల్ సవాల్ విసిరారు.
Read Also: Nama Nageswara Rao: దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి
ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. 2024 తరువాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ చీఫ్ జోస్యం చెప్పారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి 5000 కోట్ల రూపాయలను తీసుకున్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు కోసం రూ.1500 కోట్లు కలెక్ట్ చేశారని.. చిరంజీవి లాంటోళ్లు కేవలం ఐటి రైడ్స్,
ఈడీ రైడ్స్ కు భయపడటం వల్లే.. బీజేపీకి సరెండరపుతున్నారని కేఏ పాల్ విమర్శించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!