Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్లో స్వల్ప మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే, సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు వారాహి యాత్రలో మార్పలుచేశారు. ముందు అనుకున్న ప్రకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదు. శాసనస వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మారుస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read:Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థతికి బయలుదేరు ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో శ్రీ వివన్ కళ్యాణ్ కి స్వాగతం పలికిందుకు అన సైనికులు సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలని నాదెండ్ల సూచించారు. వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా ఎంతో జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ని జనసైనికులు తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. పోలీసు వినతిని పరిగణనలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చట్టాన్ని, చట్టాన్ని రక్షించే వారిని పూర్తిగా గౌరవించుకోవడం జనసేన పార్టీ మొదటి నుం పాటిస్తుందన్నారు. యాత్ర మార్పు స్థలాన్ని అనసైనికులు, వీర మహిళలు గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
Also Read
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
- Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
Also Read:108 Ambulance: ప్రాణాలు కాపాడే వాహనానికే ఆపద!
ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ ఆటోనగర్ నుండి వారాహిలో మచిలీపట్నం వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. సభా స్థలంలో 1,20,000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభకు హజరయ్యే జనసైనికులకు మజ్జిగ, మంచినీరు, స్నాక్స్ ఆహారం అందించే విధంగా 2 వేల మందితో వాలంటీర్ లు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ పరిధి వరకు పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని వీక్షించేలా 14 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు కలిగిన LED స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!