TG Cabinet Meeting : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సగం ధరకే Havells వాటర్ హీటర్..! […]
అక్కడ బీజేపీ మాటలు కోటలు దాటినా…. చేతలు గడప దాటలేదు ఎందుకు? గెలుస్తామనుకున్న మున్సిపాలిటీలో సింగిల్ డిజిట్ వార్డులకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? కాషాయ పార్టీ అట్టర్ ఫ్లాప్ షోకు బాధ్యులు ఎవరు? పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట కూడా ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? తప్పు ఎక్కడ జరిగింది.. లెక్కలు ఎలా తప్పాయి?లెట్స్ వాచ్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో.. బీజేపీకి పట్టుంది. కాషాయం కంచుకోటల్లో.. ఆర్మూర్ పట్టణం ఒకటని నమ్ముతారు ఆ పార్టీ పెద్దలు. అందుకు […]
విమాన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో చేదు అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ముఖ్యంగా సామాను బరువు కొంచెం పెరిగినా అదనపు చార్జీలు వసూలు చేసే ఎయిర్లైన్స్, విమానం గంటల కొద్దీ ఆలస్యమైనప్పుడు మాత్రం ప్రయాణీకులకు ఎందుకు సమాధానం చెప్పవు? ఇదే అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. HIV: HIV చికిత్సలో కీలక ముందడుగు.. చైనా సైంటిస్టుల ఘన విజయం.. పార్లమెంటులో రాఘవ్ చద్దా మాట్లాడుతూ, […]
తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇద్దరు కాస్త తేడాగా వ్యవహరించారా? వాళ్ళ నిర్ణయంతో పార్టీ కేడర్ కూడా షాక్ అయిందా? ఆ మార్పు పార్టీకి తెలిసే జరిగిందా? లేక వ్యక్తిగతమా? ఎవరా ఇద్దరు లోక్సభ సభ్యులు? తేడా అనిపించేలా ఏం చేశారు? తెలంగాణలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అందులో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎవరు ఎవరితో కలిశారు, ఏం పంచుకున్నారన్నది చివరి వరకు ఉత్కంఠగా మారి….. […]
Food Safety Alert: బ్రాండ్ను చూసి నమ్మి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్లోని ప్రముఖ స్వీట్ షాప్ ‘హల్దీరామ్స్’ (Haldiram’s) చేదు అనుభవాన్ని మిగిల్చింది. పాడైపోయిన, ఫంగస్ పట్టిన మిఠాయిలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి.. బాధితులు హల్దీరామ్స్లో […]
Loot Deals : చల్లని ఉదయాల్లో వేడి వేడి నీళ్లతో స్నానం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఒకవేళ మీరు మీ ఇంటి కోసం కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, అమెజాన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్ను అస్సలు వదులుకోవద్దు. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ Havells కు చెందిన ‘ఇన్స్టానియో’ మోడల్ ఇన్స్టంట్ గీజర్పై ఏకంగా 41% భారీ డిస్కౌంట్ నడుస్తోంది. అంటే దాదాపు సగం ధరకే ఈ బ్రాండెడ్ గీజర్ను మీరు సొంతం […]
Pre-Marital Relations: నేటి కాలంలో సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పరిచయాలు పెరిగి మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఏర్పరచుకునే శారీరక సంబంధాల విషయంలో యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా లైంగిక సంబంధంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ధర్మాసనం, పెళ్లికి ముందు ఎవరినీ సులభంగా నమ్మకూడదని స్పష్టం చేసింది. Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో […]
ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని […]
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం , భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. […]
ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్ మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భక్తులంతా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటే, ఈ ప్రబుద్ధులు మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడికి ‘గంజాయి’ని ప్రసాదంగా పెట్టి తమ వికృత చేష్టలను ప్రదర్శించారు. Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి? బడంగ్పేటకు చెందిన చరణ్, అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా ధర్మగిరి ఆలయానికి […]