ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు సొంత… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారా..? రాక రాక సభకు వచ్చి రచ్చ చేశారా..? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టు… ఉభయ సభల సాక్షిగా సొంత ప్రభుత్వానికే బుల్లెట్లు దింపారా? పార్టీ పరంగా వాళ్ళకు కట్టడి లేదా….? లేక కావాలని వదిలేస్తున్నారా..!? ఎవరా ఇద్దరు? ఏంటా మాటల తూటాలు? ఇద్దరూ ఇద్దరే…. ఇద్దరూ సీనియర్సే…. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీగా కాంగ్రెస్కు వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారన్న చర్చలు జోరుగా […]
కంటిన్యూ చేస్తారా? కటీఫ్ చెబుతారా? గడువు తరుముకొస్తోంది. పదవికి ముప్పు మంచుకొస్తోంది. కుర్చీల కింద బాంబులు పడుతున్న ఫీలింగ్. వాటిని ఎలా డిఫ్యూజ్ చేయాలో అర్ధంకాని కంగారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామందిలో ఇదే ఫీలింగ్ ఉందట. ఇంతకీ ఏ పదవుల విషయంలో వాళ్ళు అంతలా టెన్షన్ పడుతున్నారు? కొత్త పోస్ట్లు, ఎక్స్టెన్షన్ష కథేంటి? తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. అందుకోసం అధికార పార్టీగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. జాబితా విషయంలో ఇప్పటికే […]
కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులను (12 ఏళ్లు , 10 ఏళ్లు) చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, భర్త ప్రవీణ్ చేసిన పథకం ప్రకారమే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. స్రవంతికి, ప్రవీణ్కు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. […]
భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా (Hyderabad Disaster Response and Assets Protection Agency) తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్ ఎస్టేట్ మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు వద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న భారీ అక్రమాలను హైడ్రా అడ్డుకుంది. చెరువు ఉనికిని మాయం చేసేందుకు చుట్టూ టిన్ షీట్లు […]
వేసవి కాలంలో భానుడి భగభగలకు తోడు ఉక్కపోత, మితిమీరిన చెమట కారణంగా చర్మంపై దురద, ఎర్రటి పొక్కులు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా చెమట పట్టడం వల్ల చర్మంపై పేరుకుపోయే ఉప్పు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దారితీసి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు కేవలం సబ్బుతో కడగడం సరిపోదు.. చర్మాన్ని చల్లబరిచే సరైన సంరక్షణ పద్ధతులు అవసరం. నిపుణుల సలహాల ప్రకారం.. సరైన శుభ్రత, ఆహారపు అలవాట్లు, వదులుగా ఉండే కాటన్ దుస్తుల ఎంపిక […]
వంట గదిలో పచ్చిమిర్చి లేనిదే ఏ వంటా పూర్తి కాదు. పప్పు, చారు, తాలింపు.. ఇలా ప్రతిదానిలోనూ మిర్చి ఘాటు ఉండాల్సిందే. అయితే, ఈ పచ్చిమిర్చిని కోసేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య చేతుల మంట. ఒక్కోసారి ఈ మంట ఎంత విపరీతంగా ఉంటుందంటే, సబ్బుతో ఎన్నిసార్లు కడిగినా తగ్గదు. ఈ మంటకు కారణం పచ్చిమిర్చిలో ఉండే ‘క్యాప్సైసిన్’ (Capsaicin) అనే రసాయనం. ఇది చర్మంపై ఉండే నరాల చివరలను ఉత్తేజితం చేసి తీవ్రమైన మంటను కలిగిస్తుంది. […]
సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి చేదు వార్త. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సిమెంట్ బస్తా (50 కేజీలు) ధరపై రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో సుమారు రూ. 360కి […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్.. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం […]
ఆయన అధికార పార్టీ గూడు కోసం తపించారు. అడుగులు బలంగా వుండాలంటే పొజిషన్లో వుండాలని ఆలోచించారు. వుంటే వుండని ప్రాబ్లమ్ లేదు కదా అని పవర్ పార్టీ కూడా భావించింది. కానీ అప్పటికే సెగ్మెంట్లో తిష్టవేసిన గ్రూప్ వార్….నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. దీంతో ఆయన్ను ఎలా వదిలించుకోవాలా అని ఎదురుచూసిన అధికార పార్టీకి, ఆయనే అవకాశమిచ్చారు. సభలో సీఎం స్పీచ్తో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. ఇంతకీ ఎవరాయన? ఏం జరిగింది? ఆయనే గుడ్ బై చెప్పారా..చెప్పాల్సి […]
రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ‘థంపింగ్ విక్టరీ’ని నమోదు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ […]