India Puts Airports: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ తరుణంలో భారత విమానయాన రంగం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సమీపంలోని దేశాలు గగనతలాన్ని మూసేశాయి. దీంతో అంతర్జాతీయ విమాన మార్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్లోని అన్ని విమానాశ్రయాలను శనివారం ఆపరేషనల్ అలర్ట్పై ఉంచినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
READ MORE: Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్ షట్ డౌన్..
తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కే. రామ్ మోహన్ నాయుడు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. Airports Authority of India (AAI), Directorate General of Civil Aviation (DGCA), ఎయిర్లైన్ సంస్థలు, ప్రధాన విమానాశ్రయ నిర్వాహకులతో కలిసి సమగ్రంగా పరిస్థితిని అంచనా వేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొన్ని దేశాల గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో అనుకోని ల్యాండింగ్లు లేదా రూట్ మార్పులు జరిగే అవకాశముంది. అందువల్ల భారత విమానాశ్రయాలు అన్షెడ్యూల్డ్ ల్యాండింగ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణికుల సౌకర్యాల విషయంలోనూ ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలను దృష్టిలో ఉంచుకుని భారత్ ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంది.
READ MORE: Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..