పరిపాలన మీద పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తెలంగాణ సీఎం కసరత్తు మొదలుపెట్టారా? పాత వాసనలు లేకుండా అడ్మినిస్ట్రేషన్ను గాడిలో పెట్టాలని డిసైడయ్యారా? అందు కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకోబోతున్నారా? ఏంటా ప్రత్యేక జాగ్రత్తలు? ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 17న మూడో విడత పోలింగ్ ముగియగానే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేసి… పరిపాలనా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట సీఎం […]
ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ గెలవడం భారత్కు కీలకంగా మారింది. భారత పేసర్లు అక్కడి వాతావరణాన్ని, పిచ్ను అద్భుతంగా వినియోగించుకున్నారు. పవర్ ప్లేలోనే కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ, సౌతాఫ్రికా టాపార్డర్ను పూర్తిగా కూల్చేశారు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడైన లైన్స్, లెంగ్త్స్తో బౌలింగ్ చేసి, మొదటి […]
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు, తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇంచార్జీ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇంచార్జీ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు […]
హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..? హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి […]
Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సిట్ దృష్టి సారించిన అంశాలు… దర్యాప్తులో భాగంగా, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్లను ఉపయోగించారు, ట్యాపింగ్కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ,పబ్లిక్ డేటా ట్యాపింగ్ను […]
ఏపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ విషయమై వైసీపీలో వాయిస్ తేడాగా ఉందా? ఎక్కువ మంది నాయకులు యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదేదో ఊహించేసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు గురూ… అంటూ ముందే సందేశం పంపుతున్నారా? ప్రతిష్టాత్మక పోరులో ప్రతిపక్ష నేతల వెనకడుగుకు కారణం ఏంటి? వాళ్ళు చెబుతున్న ఆసక్తికరమైన లెక్కలేంటి? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే… 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. గ్రామ […]
Local Body Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ విడతలో మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల […]
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే బ్యాచ్ చాలామందే ఉంటారు. ముఖ్యంగా పాలిటిక్స్లో అయితే… ఈ బాపతు ఇంకాస్త ఎక్కువ. ఎక్కడ… మైలేజ్లో మనం వెనుకబడిపోతామోనన్న కంగారులో క్రాస్ చెక్ చేసుకోకుండా ఏదిబడితే అది మాట్లాడే లీడర్స్కు కొదవేలేదు. ఇప్పుడో మాజీ ఎంపీ కూడా అలాగే మాట్లాడి ఇరుక్కుపోయారట. సమాధానం చెప్పండి సార్…అంటూ పోలీసులు వెంటాడుతున్న ఆ మాజీ ఎంపీ ఎవరు? ఏమన్నారాయన?రాజకీయాలన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. కాకపోతే…. మనం ఏం మాట్లాడుతున్నామన్న స్పృహ […]
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆయన బీజేపీతో పాటు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును హరించాలనే ప్రయత్నాలు గతంలో జరిగినట్టు గుర్తు చేశారు. […]
ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు! జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం […]