కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తామంతా ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించినప్పటికీ, ఒక్క విన్నపాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణ ఏం తప్పు చేసింది?” అని ప్రశ్నిస్తూ, కేంద్రం వివక్షాపూరిత వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజినల్ […]
Motorola Edge 50 Ultra price : మీరు పండగ సీజన్ సేల్స్ మిస్ అయ్యారా? రిపబ్లిక్ డే ఆఫర్లలో ఫోన్ కొనలేకపోయామని బాధపడుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే కెమెరా క్వాలిటీ ఉన్న Motorola Edge 50 Ultra 5G ఇప్పుడు కళ్లు చెదిరే డిస్కౌంట్తో లభిస్తోంది. సాధారణంగా రూ. 65 వేల రేంజ్లో ఉండే ఈ ఫోన్, ఇప్పుడు మిడ్-రేంజ్ ధరకే అందుబాటులోకి రావడం విశేషం. భారీ తగ్గింపు.. […]
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 […]
సూపర్బైక్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ‘హయాబుసా’. జపనీస్ భాషలో ‘హయాబుసా’ అంటే ‘పెరెగ్రైన్ ఫాల్కన్’ (ఒక రకమైన డేగ) అని అర్థం. ఆకాశంలో ఆ పక్షి ఎంత వేగంగా దూసుకుపోతుందో, రోడ్డుపై ఈ బైక్ కూడా అదే వేగంతో ప్రయాణిస్తుందని దీనికి ఆ పేరు పెట్టారు. 1999లో మొదటిసారి విడుదలైనప్పటి నుండి నేటి వరకు ఈ బైక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవర్ఫుల్ ఇంజిన్ , పర్ఫార్మెన్స్ హయాబుసా ఇంత పాపులర్ కావడానికి […]
విధి నిర్వహణలో గంజాయి మాఫియా పాలిట సింహస్వప్నంగా మారి, వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (26) సాహసం యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను అడ్డుకున్న ఆమె మృతి పట్ల ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో చేరిన ఏడాది కాలంలోనే ఆమె చూపిన తెగువ, గంజాయి ముఠాను పట్టుకోవడంలో ఆమె కనబరిచిన పట్టుదల పోలీసు శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అసామాన్య పోరాటాన్ని […]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఎన్నో చారిత్రాత్మక వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన […]
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వేదికగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్పందన లభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యతను గుర్తించి నిపుణుల సమక్షంలో ఆవిష్కరించిన ‘ఇన్నోవేషన్ హబ్’ , భవిష్యత్తు ఆరోగ్య రంగ అవసరాల కోసం రూపొందించిన ‘లైఫ్ సైన్సెస్ పాలసీ’లకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, నిపుణుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయని […]
కొత్త కారు కొనేటప్పుడు చాలామంది బడ్జెట్ తక్కువగా ఉంటే బేస్ వేరియంట్ (Base Variant) తీసుకోవడానికి వెనుకాడతారు. ఎందుకంటే బేస్ మోడల్ అంటే ఏ ఫీచర్లు ఉండవని, కనీసం మ్యూజిక్ సిస్టమ్ కూడా రాదని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్యూవీ (Mid-size SUV) మార్కెట్లో పోటీ పెరగడంతో, కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ కార్లలోనే అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కథనం ప్రకారం, టాప్ మోడల్ అవసరం లేకుండానే ప్రీమియం […]
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు(శనివారం) పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఆమె రికార్డ్ సృష్టించారు. అజిత్ పవార్ మరణం తర్వాత మూడు రోజులకే ఆమె అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. ఎన్సీపీ కీలక నేతలు, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రమాణస్వీకారం జరిగింది. […]