Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త..!
- అత్తాపూర్ హల్దీరామ్స్పై ఫుడ్ సేఫ్టీ కేసు
- స్వీట్లలో ఫంగస్ – వినియోగదారుల ఆగ్రహం
- నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు
- FSL రిపోర్ట్ తర్వాత కఠిన చర్యల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety Alert: బ్రాండ్ను చూసి నమ్మి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్లోని ప్రముఖ స్వీట్ షాప్ ‘హల్దీరామ్స్’ (Haldiram’s) చేదు అనుభవాన్ని మిగిల్చింది. పాడైపోయిన, ఫంగస్ పట్టిన మిఠాయిలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
బాధితులు హల్దీరామ్స్లో స్వీట్ బాక్స్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. బాక్స్ను అన్బాక్స్ చేయగానే అందులో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. లోపల ఉన్న మిఠాయిలను పరిశీలించగా, వాటిపై తెల్లటి ఫంగస్ పేరుకుపోయి ఉండటాన్ని చూసి వారు షాక్కు గురయ్యారు. ఒకవేళ పొరపాటున ఈ స్వీట్లను పిల్లలు తిని ఉంటే పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాడైన స్వీట్ల గురించి షాప్ నిర్వాహకులను నిలదీయగా, వారు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని గమనించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్వీట్లను పరిశీలించి, పరిస్థితి తీవ్రతను బట్టి కేసు నమోదు చేశారు.
పోలీసులు హల్దీరామ్స్ నుంచి పాడైన స్వీట్ల నమూనాలను సేకరించారు. వీటిని తదుపరి విచారణ నిమిత్తం ఎఫ్.ఎస్.ఎల్ (FSL) ల్యాబ్కు పంపించారు. రిపోర్టులో స్వీట్లు కలుషితమైనట్లు తేలితే యాజమాన్యంపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..