Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..
- లక్కీ డ్రాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు
- ఓటమితో భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
- పోలీసులపై, అధికార పార్టీపైనా తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని అనుసరించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి, రెండో వార్డు సభ్యుడు శ్రవణ్ కుమార్ విజేతగా నిలిచారు. దీంతో ఎన్నికల అధికారి ఆయన పేరును అధికారికంగా ప్రకటించి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీని దక్కించుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా, బీఆర్ఎస్ క్యాంప్లో విషాదం నెలకొంది.
Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
Also Read
- TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 ఖాళీల భర్తీకి దరఖాస్తు తేదీల ప్రకటన..!
- IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
తొర్రూరులో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తల కష్టాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి?” అంటూ ఆయన కంటతడి పెట్టారు. నాయకులు కేసీఆర్ అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉన్నా, అధికార పార్టీ సాగిస్తున్న అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిని ఎర్రబెల్లి తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి పనిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి ముగింపు పడుతుందని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్గా..!
తాజావార్తలు
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
-
Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!