Kavitha : తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఎక్కువ వస్తుందని ఆమె వెల్లడించారు. కొత్త పార్టీదేముందని, ఎప్పుడైనా పెట్టొచ్చన్నారు కవిత. కానీ ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలని ఆమె వెల్లడించారు. కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా […]
తెలంగాణ స్థానిక యుద్ధంలో మరో కొత్త రాజకీయ శక్తి తలపడబోతోందా? తన ఉనికి చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోందా? పార్టీ గుర్తులతో సంబంధంలేని ఎన్నికల్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని తానేంటో నిరూపించుకోవాలనుకుంటోందా? ఇంతకీ ఏదా కొత్త శక్తి? పంచాయతీ మే సవాల్ అంటూ ఎవరికి ఛాలెంజ్ విసురుతోంది? తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఊళ్ళలో రాజకీయ పార్టీల సందడి గురించి చెప్పేపనేలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర […]
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది.
IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఇప్పటికే […]
మానవసేవే మాధవసేవ అన్న నానుడి స్ఫూర్తిగా తీసుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు సామాజిక సేవపై దృష్టి సాధించాడు. అతనే అవధానాల వసంత శర్మ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన అవధానుల వసంతశర్మ (81) విశ్రాంత ఉపాధ్యాయుడు. 2004 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొంది శేష జీవితం గడుపుతున్నారు. 2000 సంవత్సరం నుంచి నేటికీ ప్రతిరోజూ ఉదయం మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో రోగులకు వారి బంధువులకు ఉచితంగా పాలు పోస్తూ బిస్కెట్లను అందిస్తున్నారు. Railway Rules: […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే తొలి ఏకగ్రీవ ఎన్నిక నమోదు అయింది. రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవికి జవహర్ లాల్ నాయక్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
గత కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిని ఐబొమ్మ రవి వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐ బొమ్మ వెబ్సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిపై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు.
హనుమకొండలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో జరిగిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేశారు.