Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
- శివరాత్రి రోజున ఆలయంలో యువకుల వికృత చేష్టలు
- గంజాయి ప్రసాదంగా పెట్టి రీల్స్ వైరల్
- నెటిజన్ల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదులు
- కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్ మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భక్తులంతా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటే, ఈ ప్రబుద్ధులు మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడికి ‘గంజాయి’ని ప్రసాదంగా పెట్టి తమ వికృత చేష్టలను ప్రదర్శించారు.
Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?
Also Read
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా...! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
బడంగ్పేటకు చెందిన చరణ్, అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా ధర్మగిరి ఆలయానికి చేరుకున్నారు. అందరూ చేసేలా కాకుండా తాము ఏదో వెరైటీగా చేస్తున్నామనే భ్రమలో గంజాయిని దేవుడి పాదాల చెంత ఉంచి వీడియో తీశారు. “దేవుడికి అందరూ కొబ్బరికాయలు కొడతారు.. మేము మాత్రం గంజాయి ప్రసాదం పెడుతున్నాం” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. అనంతరం ఆ వీడియోను ‘ఇన్స్టాగ్రామ్’లో రీల్స్గా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడిని, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీపీ సజ్జనార్, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
వీడియో ఆధారంగా నిందితులు బడంగ్పేటకు చెందిన వారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇలాంటి రీల్స్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. “సోషల్ మీడియాను విజ్ఞానానికి, వినోదానికి వాడాలి తప్ప, ఇలాంటి వికృత చేష్టలకు కాదు. పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా?
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం!
మేమేదో సాహసం చేశామని… pic.twitter.com/MWeFz2Id19
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2026
తాజావార్తలు
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!