Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stocks India 2026: స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్ల తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణమే సిటీ పల్స్ మల్టీవెంచర్స్ లిమిటెడ్. గత ఐదేళ్లలో ఈ స్టాక్ అందించిన రాబడి చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అయితే, భారీ లాభాలతో పాటు ఇందులో రిస్క్ కూడా పొంచి ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం.. ఏ దేశం ఏ వైపు..
Also Read
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
లక్ష పెట్టుబడి.. రూ.3.5 కోట్ల లాభం!
2021 ఏప్రిల్ సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.8 వద్ద ఉండేది. అప్పట్లో ఎవరైనా ఒక రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు (ఫిబ్రవరి 2026 నాటికి) దాని విలువ సుమారు రూ.3.50 కోట్లుగా మారేది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2,887 వద్ద ట్రేడవుతోంది. అంటే కేవలం ఐదేళ్లలోనే దాదాపు 31,900 శాతం పెరుగుదలను నమోదు చేసి, అసలైన మల్టీబ్యాగ్గర్గా నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.3,000 కోట్లు దాటడం విశేషం.
వినోద రంగం నుంచి డిజిటల్ వైపు..
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ తొలుత గుజరాత్లో ‘WOW సినీ పల్స్’ బ్రాండ్ కింద మల్టీప్లెక్స్లు, సినిమా పంపిణీ, నిర్మాణ రంగంలో రాణించింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తన వ్యాపార శైలిని మార్చుకుంటోంది. స్వంతంగా WOWPLEX అనే OTT యాప్ను నిర్వహిస్తోంది. థియేటర్ల నుంచి ఆన్లైన్ కంటెంట్, డిజిటల్ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. సిటీ పల్స్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. తన వ్యాపారాన్ని విభిన్న రంగాలకు విస్తరించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణ, డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫారమ్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ప్రతిష్టాత్మక గిఫ్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వంటి వాటికి తన రంగాలను విస్తరించింది.
మార్చి 7న కీలక నిర్ణయం..
ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మరో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మార్చి 7, 2026న బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ (వాటాల విభజన) గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రకటన వస్తే స్టాక్లో మరింత కదలిక వచ్చే అవకాశం ఉంది.భారీ లాభాలు కనిపిస్తున్నా, కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 మార్చిలో 38.52% గా ఉన్న ప్రమోటర్ల వాటా, 2025 సెప్టెంబర్ నాటికి 11.98% కి పడిపోయింది. సాధారణ ఇన్వెస్టర్ల వాటా 88.01% కి పెరిగింది. సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs/DIIs) ఇందులో చాలా తక్కువగా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
READ ALSO: IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!