Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stocks India 2026: స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్ల తలరాతను పూర్తిగా మార్చేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణమే సిటీ పల్స్ మల్టీవెంచర్స్ లిమిటెడ్. గత ఐదేళ్లలో ఈ స్టాక్ అందించిన రాబడి చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అయితే, భారీ లాభాలతో పాటు ఇందులో రిస్క్ కూడా పొంచి ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం.. ఏ దేశం ఏ వైపు..
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
లక్ష పెట్టుబడి.. రూ.3.5 కోట్ల లాభం!
2021 ఏప్రిల్ సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ.8 వద్ద ఉండేది. అప్పట్లో ఎవరైనా ఒక రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు (ఫిబ్రవరి 2026 నాటికి) దాని విలువ సుమారు రూ.3.50 కోట్లుగా మారేది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.2,887 వద్ద ట్రేడవుతోంది. అంటే కేవలం ఐదేళ్లలోనే దాదాపు 31,900 శాతం పెరుగుదలను నమోదు చేసి, అసలైన మల్టీబ్యాగ్గర్గా నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.3,000 కోట్లు దాటడం విశేషం.
వినోద రంగం నుంచి డిజిటల్ వైపు..
2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ తొలుత గుజరాత్లో ‘WOW సినీ పల్స్’ బ్రాండ్ కింద మల్టీప్లెక్స్లు, సినిమా పంపిణీ, నిర్మాణ రంగంలో రాణించింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా తన వ్యాపార శైలిని మార్చుకుంటోంది. స్వంతంగా WOWPLEX అనే OTT యాప్ను నిర్వహిస్తోంది. థియేటర్ల నుంచి ఆన్లైన్ కంటెంట్, డిజిటల్ ఆదాయ మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. సిటీ పల్స్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. తన వ్యాపారాన్ని విభిన్న రంగాలకు విస్తరించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణ, డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫారమ్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ప్రతిష్టాత్మక గిఫ్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వంటి వాటికి తన రంగాలను విస్తరించింది.
మార్చి 7న కీలక నిర్ణయం..
ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మరో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మార్చి 7, 2026న బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ (వాటాల విభజన) గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రకటన వస్తే స్టాక్లో మరింత కదలిక వచ్చే అవకాశం ఉంది.భారీ లాభాలు కనిపిస్తున్నా, కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 మార్చిలో 38.52% గా ఉన్న ప్రమోటర్ల వాటా, 2025 సెప్టెంబర్ నాటికి 11.98% కి పడిపోయింది. సాధారణ ఇన్వెస్టర్ల వాటా 88.01% కి పెరిగింది. సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs/DIIs) ఇందులో చాలా తక్కువగా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.
READ ALSO: IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!
తాజావార్తలు
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..