భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్గంజ్ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు.
ఉత్తరప్రదేశ్లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించే మెగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి.
Triple Talaq: కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తన భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడు. రైలు ఝాన్సీ జంక్షన్ రాగానే రైలు నుంచి దిగి పరారయ్యాడు. దీంతో షాక్ తిన్న భార్య రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో భూ వివాదంలో పార్టీల మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడినట్లు సమాచారం.
Brij Bhushan: బీజేపీ కీలక నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి షాక్ తగిలింది. అతనికి పార్టీ టికెట్ నిరాకరించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి.
PM Modi: ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ(ఎస్పీ)కి చెందిన కీలక నేత మరియా ఆలం ఇటీవల ఓ మైనారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ఓట్ జిహాద్’’కి పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్గా మార్చాడు ఉపాధ్యాయుడు.