UP: స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన ఓ వ్యక్తి.. వేదికపై ప్రసంగిస్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.
Benefits of scorpion venom : కోట్లు పలుకుతున్న తేలు విషం.. దాంతో ఏం చేస్తారంటే..
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పట్టణంలోని అవంతీబాయి కూడలికి చేరుకోగానే.. అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు ఆయనకు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ఓ కార్యకర్త వాహనంపై నల్ల ఇంకు పోసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారిని పోలీసులు తరిమికొట్టారు. అనంతరం.. సభా వేదిక వద్దకు చేరుకున్న స్వామి ప్రసాద్ మౌర్య వేదికపై చేరుకుని ప్రసంగిస్తున్నారు. ఇంతలో ముందు వరుసలో కూర్చున్న ఓ యువకుడు లేచి స్వామి ప్రసాద్ మౌర్య వైపు షూ విసిరాడు. యువకుడు విసిరిన షూ పోడియం సమీపంలో అమర్చిన కెమెరా ట్రిపాడ్కు తగిలింది.
Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..
యువకుడు బూటు విసిరడంతో సభాస్థలి వద్ద తోపులాట జరిగింది. ఘటనా స్థలం నుంచి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ యువకుడిని ధర్మేంద్ర ధాకడ్ గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత యోగి యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ తోమర్ ఓ వీడియోను విడుదల చేస్తూ షూ విసిరిన వ్యక్తిని ఆ సంస్థ అధికారిగా అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని కపటత్వం అని పిలిచే వారిని, బ్రాహ్మణులను రాక్షసులని పిలిచేవారిని, రామచరిత్ మానస్ని అవమానించేవారిని ఇలాంటి బూట్లతో స్వాగతిస్తామని తెలిపారు. రాముడు, కృష్ణుడిని అవమానించే వారికీ ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!