Priyanka Gandhi: బీజేపీకి భయపడి ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ రోజు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అమేథీ నుంచి బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎదుర్కొనేందుకు కిషోరీ లాల్ శర్మని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కి కంచుకోటలుగా ఉండేవి. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
Read Also: AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
అయితే, ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని ఒప్పించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆమె మాత్రం నో చెప్పింది. దీనికి ఒక కారణం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను గెలిస్తే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురం కూడా పార్లమెంట్లో ఉంటామని, దీంతో బీజేపీ వంశపారంపర్య రాజకీయాలు అని చేసే విమర్శలకు మరింత అవకాశం ఇచ్చినట్లు ప్రియాంకా భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఆరోపణలకు భయపడే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఆమె నిర్ణయం ఓటర్లలో ప్రతికూల భావన కలిగిస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆమె పోటీ చేసి ఉంటే స్టార్ పవర్తో కాంగ్రెస్ లాభపడేదనే భావనని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కీలకమైన రాయ్బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!