Uttar Pradesh: పాఠశాల వద్ద వైన్ షాప్ తొలగించాలని కోర్టుకెక్కిన ఎల్కేజీ విద్యార్థి..
Uttar Pradesh: పాఠశాల పక్కన ఉన్న మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని కోరుతూ ఓ ఎల్కేజీ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. ఐదేళ్ల విద్యార్థి పాఠశాల పక్కనే ఉన్న వైన్ షాపును తొలగించానలి కోరుతూ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాడు. నాలుగు నెలల న్యాయపోరాటం తర్వాత తీర్పు అతడికి అనుకూలంగా వచ్చింది. పిల్ని విచారించిన హైకోర్టు మార్చి 31, 2025 తర్వాత పాఠశాల పక్కనే ఉన్న మద్యం విక్రయ కేంద్రాన్ని పునరుద్ధరించొద్దని కాన్పూర్ ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
కాన్పూర్ ఆజాద్ నగర్లో నివిసిస్తున్న ఎల్కేజీ విద్యార్తి అర్థవ్ దీక్షిత్ తన న్యాయవాది అశుతోష్ శర్మ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నా ఇల్లు, పాఠశాల ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి, వీటికి దగ్గరగా మద్యం దుకాణం ఉందని, రోజూ మద్యం దుకాణం ముందునుంచే రాకపోకలు సాగించాలని, ఈ సమయంలో మద్యం సేవించిన వ్యక్తులు గుంపులుగుంపులగా ఉండీ గొడవలకు కారణం అవుతున్నారని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ దుకాణాన్ని ఇక్కడ నుంచి వేరే చోటుకి మార్చాలని, ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతుందని పేర్కొన్నారు.
Also Read
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
హైకోర్టులో పిటిషన్ వేయడానికి ముందు, విద్యార్థి అర్థవ్ తన తండ్రి ద్వారా కాన్పూర్ కలెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, యూపీ సీఎం పోర్టల్కి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, 2019లో విద్యార్థి స్కూల్ ప్రారంభం కాగా, గత 30 ఏళ్లుగా అక్కడ మద్యం కాంట్రాక్ట్ నడుస్తోందని చెబుతూ, దానిని తరలించేందుకు ఎక్సైజ్ శాఖ అంగీకరించలేదు. దీని తర్వాత విద్యార్థి తరుపున న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చాలా నెలలుగా అలహాబాద్ హైకోర్టు విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ వివరణ కోరింది. హైకోర్టు తీర్పునిస్తూ ఇప్పుడు ఈ కాంట్రాక్టును పునరుద్ధరించొద్దని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయవాది అశుతోష్ శర్మ తెలిపారు. పాఠశాల పక్కనే కాంట్రాక్టు నడుస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఎలా రెన్యూవల్ అవుతుందని, అయితే గుడి, ఆస్పత్రి, పాఠశాల పక్కన 50 మీటర్ల పరిధిలో కాంట్రాక్ట్ చేయాలనే నిబంధన ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?