Uttar Pradesh: పాఠశాల వద్ద వైన్ షాప్ తొలగించాలని కోర్టుకెక్కిన ఎల్కేజీ విద్యార్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: పాఠశాల పక్కన ఉన్న మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని కోరుతూ ఓ ఎల్కేజీ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. ఐదేళ్ల విద్యార్థి పాఠశాల పక్కనే ఉన్న వైన్ షాపును తొలగించానలి కోరుతూ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాడు. నాలుగు నెలల న్యాయపోరాటం తర్వాత తీర్పు అతడికి అనుకూలంగా వచ్చింది. పిల్ని విచారించిన హైకోర్టు మార్చి 31, 2025 తర్వాత పాఠశాల పక్కనే ఉన్న మద్యం విక్రయ కేంద్రాన్ని పునరుద్ధరించొద్దని కాన్పూర్ ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
కాన్పూర్ ఆజాద్ నగర్లో నివిసిస్తున్న ఎల్కేజీ విద్యార్తి అర్థవ్ దీక్షిత్ తన న్యాయవాది అశుతోష్ శర్మ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నా ఇల్లు, పాఠశాల ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి, వీటికి దగ్గరగా మద్యం దుకాణం ఉందని, రోజూ మద్యం దుకాణం ముందునుంచే రాకపోకలు సాగించాలని, ఈ సమయంలో మద్యం సేవించిన వ్యక్తులు గుంపులుగుంపులగా ఉండీ గొడవలకు కారణం అవుతున్నారని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ దుకాణాన్ని ఇక్కడ నుంచి వేరే చోటుకి మార్చాలని, ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతుందని పేర్కొన్నారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
హైకోర్టులో పిటిషన్ వేయడానికి ముందు, విద్యార్థి అర్థవ్ తన తండ్రి ద్వారా కాన్పూర్ కలెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, యూపీ సీఎం పోర్టల్కి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, 2019లో విద్యార్థి స్కూల్ ప్రారంభం కాగా, గత 30 ఏళ్లుగా అక్కడ మద్యం కాంట్రాక్ట్ నడుస్తోందని చెబుతూ, దానిని తరలించేందుకు ఎక్సైజ్ శాఖ అంగీకరించలేదు. దీని తర్వాత విద్యార్థి తరుపున న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చాలా నెలలుగా అలహాబాద్ హైకోర్టు విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ వివరణ కోరింది. హైకోర్టు తీర్పునిస్తూ ఇప్పుడు ఈ కాంట్రాక్టును పునరుద్ధరించొద్దని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయవాది అశుతోష్ శర్మ తెలిపారు. పాఠశాల పక్కనే కాంట్రాక్టు నడుస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఎలా రెన్యూవల్ అవుతుందని, అయితే గుడి, ఆస్పత్రి, పాఠశాల పక్కన 50 మీటర్ల పరిధిలో కాంట్రాక్ట్ చేయాలనే నిబంధన ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!