కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…
విద్యుత్ సరఫరాలో అంతరాయం కరోనా రోగుల ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం సృష్టిస్తోంది.. మహమ్మారి కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను పూనుకుంటోంది.. బెడ్ల కొరత, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అయినా.. క్రమంగా అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మృతుల సంఖ్య కూడా కలవరపెడుతోంది.. తాజాగా, గోరఖ్పూర్లోని ఆరుహి ఆస్పత్రి అండ్ ట్రామా సెంటర్లో చికిత్స సమయంలో వెంటిలేటర్పై ఇద్దరు కోవిడ్ రోగులు మృతిచెందారు.. ఈ ఘటనను సీరియస్గా…
రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …
ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది…
ప్రస్తుతం 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. మే 1వ తేదీ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.. అయితే, 45 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకా ఉచితమే అయినా.. 18 ఏళ్ల పైబడిన వారి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం.. అంటే.. ఆ భారాన్ని.. వినియోగదారులు లేదా.. రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18…
భారత్తో కరోనా మహమ్మారి సేకండ్వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మరో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి…