Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం మిగుల్చుతోంది. పుట్టిన రోజైనా.. చావు రోజైనా.. పెళ్లి జరిగినా.. ఇలా సందర్భం ఏదైనా సరే.. మద్యం ఏరులై పారుతోంది. ఆ తర్వాత జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. యువతకు అంత్యక్రియల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
READ ALSO: VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం.. యువత నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏ యాక్సిడెంట్ చూసినా.. మద్యం మత్తు లేదా నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా.. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. అతివేగం వారి నిండు ప్రాణాలు తీసింది. బంధువుల అంత్యక్రియలు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో యువకులు ప్రయాణిస్తున్న బైక్.. కమలాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన యువకులను నవీన్ కుమార్, నాగరాజుగా గుర్తించారు. ఎదిగి వచ్చిన కొడుకులు హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతివేగం నిర్లక్ష్యం యువకుల ప్రాణాలు తీసినట్లు తేలింది. వారికి వారే వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టుకోవడం వల్ల వారి ప్రాణాలు పోయినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఇద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మహమ్మారి వల్లే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్న పోలీసులు.. గ్రామంలోని మిగతా యువకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరు యువకుల అంత్యక్రియలకు హాజరయ్యారు. వారు ప్రాణాలు కోల్పోయిన తీరును వివరించే ప్రయత్నం చేశారు.
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేటి యువతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తీరుతో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా శ్రమ పడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల ఆశలని నిర్లక్ష్యంతో ఎలా వమ్ము చేస్తున్నారు? అనే విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారానే అక్కడున్న యువతకు తెలిసేలా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్కు క్వాలిఫై..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!