Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం మిగుల్చుతోంది. పుట్టిన రోజైనా.. చావు రోజైనా.. పెళ్లి జరిగినా.. ఇలా సందర్భం ఏదైనా సరే.. మద్యం ఏరులై పారుతోంది. ఆ తర్వాత జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. యువతకు అంత్యక్రియల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
READ ALSO: VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?
Also Read
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం.. యువత నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏ యాక్సిడెంట్ చూసినా.. మద్యం మత్తు లేదా నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా.. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. అతివేగం వారి నిండు ప్రాణాలు తీసింది. బంధువుల అంత్యక్రియలు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో యువకులు ప్రయాణిస్తున్న బైక్.. కమలాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన యువకులను నవీన్ కుమార్, నాగరాజుగా గుర్తించారు. ఎదిగి వచ్చిన కొడుకులు హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతివేగం నిర్లక్ష్యం యువకుల ప్రాణాలు తీసినట్లు తేలింది. వారికి వారే వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టుకోవడం వల్ల వారి ప్రాణాలు పోయినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఇద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మహమ్మారి వల్లే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్న పోలీసులు.. గ్రామంలోని మిగతా యువకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరు యువకుల అంత్యక్రియలకు హాజరయ్యారు. వారు ప్రాణాలు కోల్పోయిన తీరును వివరించే ప్రయత్నం చేశారు.
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేటి యువతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తీరుతో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా శ్రమ పడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల ఆశలని నిర్లక్ష్యంతో ఎలా వమ్ము చేస్తున్నారు? అనే విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారానే అక్కడున్న యువతకు తెలిసేలా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!