Cyber Fraud: హస్కీ వాయిస్తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్ కట్ చేస్తే భారీ సైబర్ మోసం బయటపడుతుంది. వృద్ధులు.. అమాయకులే సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ 80 ఏళ్ల వృద్ధున్ని నమ్మించి ఏకంగా 24 లక్షల రూపాయలు కొట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
READ ALSO: Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
Also Read
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
పెట్టుబడుల పేరిట హైదరాబాద్ గోపన్పల్లిలో ఉంటున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అతన్ని మోసం చేసి లక్షల రూపాయలు కొట్టేసి చెక్కేశారు. తొలుత వృద్ధుడి ఫోన్కు రిధివెలే అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. అవతల అమ్మాయి అని తెలియగానే.. వృద్ధుడు కాస్తా బెండ్ అయ్యాడు. ఆ మాటా ఈ మాటా చెప్పి బుట్టలో పెట్టేసింది మాయలేడీ. క్రమక్రమంగా ముగ్గులోకి దించి.. కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అలాంటి యాప్స్ మన దగ్గర ఉన్నాయని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మాడు ఆ అమాయక వృద్ధుడు. గుడ్డిగా ఆమె చెప్పిన యాప్లో పెట్టుబడి పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.
ప్రతి రోజూ మాటల్లో పెడుతూ.. పెట్టుబడులు పెట్టించింది మాయ లేడీ. కొంతకాలం భారీ లాభాలు వచ్చినట్లు బాధితుడికి తప్పుడు సమాచారం కూడా ఇచ్చింది. పైగా వృద్ధుడి అకౌంట్లో భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షల 77వేల 040 ఉన్నట్లు చూపించింది. ఇక అక్కడి నుంచి మరో కథ షురూ చేసింది. ఆ డబ్బు విడుదల చేయాలంటే ముందుగా ‘కన్వర్షన్ ఫీ’ చెల్లించాలని చెప్పింది. ఆ మాయలేడీ మాటలు ఇంకా నమ్మిన బాధితుడు.. వివిధ బ్యాంక్ ఖాతాలకు మొత్తంగా రూ.24 లక్షల 38 వేల 483 ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటికీ మాయలేడీ దాహం తీరలేదు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసం జరిగినట్లు గ్రహించాడు వృద్ధుడు. గట్టిగా నిలదీయడంతో అవతలిపక్క నుంచి ఫోన్ కట్ అయింది. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
ట్రెండింగ్
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!