Cyber Fraud: హస్కీ వాయిస్తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్ కట్ చేస్తే భారీ సైబర్ మోసం బయటపడుతుంది. వృద్ధులు.. అమాయకులే సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ 80 ఏళ్ల వృద్ధున్ని నమ్మించి ఏకంగా 24 లక్షల రూపాయలు కొట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
READ ALSO: Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
పెట్టుబడుల పేరిట హైదరాబాద్ గోపన్పల్లిలో ఉంటున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అతన్ని మోసం చేసి లక్షల రూపాయలు కొట్టేసి చెక్కేశారు. తొలుత వృద్ధుడి ఫోన్కు రిధివెలే అనే మహిళ నుంచి కాల్ వచ్చింది. అవతల అమ్మాయి అని తెలియగానే.. వృద్ధుడు కాస్తా బెండ్ అయ్యాడు. ఆ మాటా ఈ మాటా చెప్పి బుట్టలో పెట్టేసింది మాయలేడీ. క్రమక్రమంగా ముగ్గులోకి దించి.. కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అలాంటి యాప్స్ మన దగ్గర ఉన్నాయని నమ్మించింది. ఇదంతా నిజమని నమ్మాడు ఆ అమాయక వృద్ధుడు. గుడ్డిగా ఆమె చెప్పిన యాప్లో పెట్టుబడి పెట్టాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.
ప్రతి రోజూ మాటల్లో పెడుతూ.. పెట్టుబడులు పెట్టించింది మాయ లేడీ. కొంతకాలం భారీ లాభాలు వచ్చినట్లు బాధితుడికి తప్పుడు సమాచారం కూడా ఇచ్చింది. పైగా వృద్ధుడి అకౌంట్లో భారత కరెన్సీలో సుమారు రూ.62 లక్షల 77వేల 040 ఉన్నట్లు చూపించింది. ఇక అక్కడి నుంచి మరో కథ షురూ చేసింది. ఆ డబ్బు విడుదల చేయాలంటే ముందుగా ‘కన్వర్షన్ ఫీ’ చెల్లించాలని చెప్పింది. ఆ మాయలేడీ మాటలు ఇంకా నమ్మిన బాధితుడు.. వివిధ బ్యాంక్ ఖాతాలకు మొత్తంగా రూ.24 లక్షల 38 వేల 483 ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటికీ మాయలేడీ దాహం తీరలేదు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసం జరిగినట్లు గ్రహించాడు వృద్ధుడు. గట్టిగా నిలదీయడంతో అవతలిపక్క నుంచి ఫోన్ కట్ అయింది. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!