T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్లో తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం నార్తర్న్ రైల్వే (NR) ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో నార్తర్న్ రైల్వే ఢిల్లీ నుంచి సబర్మతి వరకు ప్రత్యేక రైలును నడిపేందుకు సిద్ధమైంది.
India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్కు ముందు సంచలన నిర్ణయం!
Also Read
- Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
- Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
- Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
ఈ ప్రత్యేక రైలు నేడు (మార్చి 7)రాత్రి 11:45 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు మార్చి 8 మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, గురుగ్రమ్, జైపూర్ మార్గంగా ప్రయాణిస్తుంది. 04062 ట్రైన్ నంబర్ కలిగిన ఈ రైలులో మొత్తం 19 కోచ్లు ఉండగా.. వాటిలో థర్డ్ AC, సెకండ్ AC కోచ్లు కూడా ఉంటాయి.
భారత జట్టు శుక్రవారం నాడే అహ్మదాబాద్ కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్ చేయనుంది. న్యూజిలాండ్ జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. భారత్ మీడియా సమావేశం మాత్రం ప్రాక్టీస్కు 15 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది.
Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!
ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ను ఒక్కసారి కూడా ఓడించలేదు. దీనితోపాటు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసారి చరిత్రను తిరగరాస్తోందని నమ్మకం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా భారత్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలవడం, సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలవడం లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
తాజావార్తలు
-
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!