Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..
- రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల..
- యాంత్రీకరణ పథకంలో సబ్సిడీ సొమ్ము ఇక నేరుగా రైతుల ఖాతాల్లోకే..
- అధికారులను ఆదేశించిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లు, ఇతర యంత్రాలపై వచ్చే 40 శాతం సబ్సిడీ నేరుగా కంపెనీలకు వెళ్లేది. దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత లోపిస్తోందని భావించిన ప్రభుత్వం, ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే (DBT) జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన నాణ్యమైన పనిముట్లను ఎంచుకునే స్వేచ్ఛ కలగడమే కాకుండా… దళారుల ప్రమేయం తగ్గుతుంది.
Also Read:Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత రాకుండా, ఇప్పటి నుంచే బఫర్ స్టాక్ను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. నేల సారాన్ని పెంచేందుకు రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ (APR) నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
Also Read:T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?
వ్యవసాయ శాఖ ఆధునీకరణలో భాగంగా ప్రతి గ్రామంలోని రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే.. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, దానికి అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. ఈ వినూత్న మార్పుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా.. ప్రభుత్వ రాయితీలు అర్హులైన ప్రతి రైతుకూ సక్రమంగా అందేలా మంత్రి తుమ్మల పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!