Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..
- రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల..
- యాంత్రీకరణ పథకంలో సబ్సిడీ సొమ్ము ఇక నేరుగా రైతుల ఖాతాల్లోకే..
- అధికారులను ఆదేశించిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లు, ఇతర యంత్రాలపై వచ్చే 40 శాతం సబ్సిడీ నేరుగా కంపెనీలకు వెళ్లేది. దీనివల్ల నిధుల వినియోగంలో పారదర్శకత లోపిస్తోందని భావించిన ప్రభుత్వం, ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే (DBT) జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రైతులకు తమకు నచ్చిన నాణ్యమైన పనిముట్లను ఎంచుకునే స్వేచ్ఛ కలగడమే కాకుండా… దళారుల ప్రమేయం తగ్గుతుంది.
Also Read:Redeveloping Colonies: సొంత నిధులతో కొత్త భవనాలు.. ఢిల్లీలో 7 ప్రభుత్వ కాలనీలకు కొత్త కళ..
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత రాకుండా, ఇప్పటి నుంచే బఫర్ స్టాక్ను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. నేల సారాన్ని పెంచేందుకు రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ (APR) నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
Also Read:T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?
వ్యవసాయ శాఖ ఆధునీకరణలో భాగంగా ప్రతి గ్రామంలోని రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులకు సలహాలు ఇచ్చేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే.. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, దానికి అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాలను కల్పించనున్నారు. ఈ వినూత్న మార్పుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా.. ప్రభుత్వ రాయితీలు అర్హులైన ప్రతి రైతుకూ సక్రమంగా అందేలా మంత్రి తుమ్మల పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!