‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి భాగం ‘బ్యాచ్ 1’ను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ ‘బ్యాచ్’ మూవీకి రఘు కుంచె సంగీతం అందించారు. చిత్ర దర్శకుడు…
పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల.. ముద్దుగా బొద్దుగా ఉండడంతో పాటు వయ్యారాలు ఒలకబోయడంలో ఈ మాత్రం వెనకాడకపోయేసరికి మొదటి సినిమాతోనే అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అయ్యేసరికి అమ్మడి పంట పండింది. ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే శ్రీలీల కు మాత్రం మంచి ఆఫర్లను తీసుకొచ్చిపెట్టింది. పెళ్లి సందD విడుదల కాకముందే ఈ కుర్ర బ్యూటీ మాస్ మహారాజ రవితేజ…
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి. చక్రవర్తి అసలు…
ఓ నాటి అందాల తార, తరువాతి రోజుల్లో అందాల బామ్మగా, మామ్మగా నటించిన వహిదా రెహమాన్ మన తెలుగునాటనే వెలుగు చూశారు. వహిదా 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగ రీత్యా తెలుగునేలపైనా ఆయన పనిచేశారు. అలా విశాఖపట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో ఆమె చదివారు. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్నారు. వహిదా డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తండ్రి మరణంతో ఆమె నృత్యమే ఆమెకు…
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా…
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో…
ఇప్పుడప్పుడే ఈ కరోనా మహమ్మారి పోయేలా కనిపించడం లేదు. చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కుదేలు చేసిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్స్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి…
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.. ‘అట్లుంటది మనతోని’ అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం…